కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

Publish Date:Aug 22, 2025

Advertisement

 

 

ఓటీటీలో వచ్చే ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసిన బాలుడు... హత్య కంటే రెండు రోజుల ముందే బాలుడు మిషన్ డన్ పేరుతో ఒక లేఖ రాసుకున్నాడు. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రభావితమయ్యాడు. గ్యాస్ లీక్ చేసి పరార్ అవ్వాలని ప్లాన్ చేశాడు. అదే విషయాన్ని మిషన్ డాన్ పేరుతో వచ్చిరాని ఇంగ్లీషు లో ఒక పేపర్ మీద రాసుకున్నాడు. పథకం ప్రకారం పక్కింట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అంతలో అమ్మాయి కనిపించింది. దీంతో భయపడిపోయిన బాలుడు తన దొంగతనం విషయం బయటపడకుండా ఉండడానికి బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. 

బాలిక సహస్ర హత్య జరిగిన రోజే పోలీసులు బాలు డిని విచారించారు. అయితే విచారణ చేస్తున్న సమయం లోసహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్లానని పోలీసు లను తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి నాన్న నాన్న అని గట్టి గట్టిగా అరుపులు వినిపించాయని పోలీసులను నమ్మించాడు. బాలుడు చెప్పిన మాటలు నమ్మిన పోలీసులు సహస్రను ఇతరులు చంపి ఉంటారని అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఇలా పోలీసులు గత ఐదు రోజులుగా భవనంలోని ప్రతి ఒక్కరిని విచారించడమే కాకుండా బాలిక తల్లిదండ్రులను కూడా విచారించారు. 

ఈ కేసులో ఎస్ఓటి, కూకట్పల్లి పోలీసులు 300 మందిని విచారించారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా కూడా కూకట్పల్లి లో జరిగిన సహస్ర బాలిక హత్య కేసు మిస్టరీ వీడలేదు. ఈరోజు ఉదయం ఎస్వోటీ పోలీసులు మళ్లీ హత్య జరిగిన భవనానికి వెళ్లి ఆధారాలు సేకరి స్తున్న సమయంలో పక్క భవనం నుండి ఈజీగా ఈ బిల్డింగ్ లోకి దూకవచ్చునని  గుర్తించారు. దీంతో ఎస్ఓటి పోలీసులు పక్క బిల్డింగ్ లో ఉన్న వారందరిని విచారించారు. అయితే వర్క్ ఫర్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు తన గది పక్కనే ఓ బాలుడు 15 నిమిషాల పాటు దాక్కొని ఉన్నాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. 

పక్క భవనంలోనే ఆ బాలుడు ఉంటాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడికి కోసం వెంటనే స్కూలుకు వెళ్లి స్కూల్లోనే బాలుడిని పక్కకు పిలిచి విచారణ చేశారు. తనకు హత్యకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి బాలుడు పోలీసులను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకు బాలుడి పై అనుమానం వచ్చి అతన్ని తీసుకొని ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీ చేయగా.. కత్తి, రక్తంతో కూడిన దుస్తులు, పక్క ఇంట్లో దోచుకునేందుకు ప్లాన్ వేసిన మిషన్ డౌన్ పేరుతో  రాసుకున్న లేఖ లభ్యమైంది.

 దీంతో ఎస్ఓటి పోలీసులు వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే బాలుడి కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లోకి వచ్చారు. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతు న్నారు. హత్య చేసిన బాలుడు మరియు  మృతు రాలి తమ్ముడు స్నేహితులు.... ఈ క్రమంలోనే మృతు రాలు సహస్ర పుట్టినరోజు వేడుకలకు నిందితుడు హాజరయ్యాడు.

By
en-us Political News

  
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.