Publish Date:Apr 20, 2024
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. అధికారం ఉంటేనే నిలిచే బంధం అని వగచడమే మిటిలింది ఆయనకు. పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు.. ఓటమి తరువాత పార్టీ వదిలి వెడుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన దూషణలకు, బెదరింపులకు ఎవరూ వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది.
ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్ లా ఆయనకే అందరి కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్ కు అవగతం అవుతోందా అంటే నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. సరే పార్టీ నేతలు, సిట్టింగులు మారుతున్నారు సరే.. స్వయానా బంధువులు కూడా బంధుత్వానికీ బే, పార్టీకీ బేబ్బే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడాన్ని ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
తాజాగా కేటీఆర్ కు స్వయానా బావమరిది అయిన ఎడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు, పైగా బావ అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్ కు చెప్పుకోలేని పరాభవంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ తో విభేదించి కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం కేటీఆర్ కు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కారు దిగి వెళ్లి పోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి పార్టీ వదిలి వెడుతున్న వారిపై దూషణలకు దిగుతూ, ద్రోహులూ అవకాశ వాదులూ అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన బావమరిదే బీఆర్ఎస్ కు జెల్ల కొట్టి కాంగ్రెస్ పంచన చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ మారకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్.. పార్టీని ఏం కాపాడుతారంటూ కేటీఆర్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-wife-brother-joins-congress-39-174183.html
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,