Publish Date:Jan 15, 2025
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం (జనవరి 16) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్కు హైకోర్టులో, ఆ తరువాత బుధవారం (జనవరి 15) సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేపు ఈడీ విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్పై ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని నందినగర్లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే నంది నగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా ఈ సీన్ కనిపించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఈడీ విచారణకు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బలప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్టు చేస్తే బెటరని భావిస్తున్నారు. ఈడీ అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టమనీ, అదే ఏసీబీ అరెస్టు చేస్తే బెయిలు ఒకింత తొందరగా వస్తుందనీ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈడీ విచారణ తరువాత కేటీఆర్ అరెస్టు అవుతారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్టపీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-to-attend-ed-inquiry-39-191327.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.