కేటీఆర్ దూకుడు.. నేతల్లో వణుకు

Publish Date:Jul 3, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెరాస అధ్యక్షుడు ఎవరు? గత కొద్ది రోజులగా ఇక్కడా అక్కడ వినిపిస్తున్న ఈ  ప్రశ్న, ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా  తెరాస వర్గాల్లోనే వినిపించడం విశేషం. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైన వరకు దూరంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇటు ప్రభుత్వ వ్యవహార్ల్లో అయినా చుట్టపు చూపుగా పాల్గొంటున్నారే తప్ప మునుపటిలా మనసు పెట్టడం లేదని తెరాస నాయకులు, కార్యకర్తలు కొంత బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందులా క్రియాశీలంగా వ్యవహరించడం లేదని, పరిపాలనను పెద్దగా పట్టించుకోవడం లేదని అధికార వర్గాల్లోనూ చాల కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వస్తోందని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎక్కువకాలం ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడం, రోజులు, వారాల తరబడి అధికారులు ఎవరికి అందుబాటులో  లేకపోవడంతో కీలక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవలసి వస్తోందని మాట అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాజకీయాలు మునుపటిలా రుచించడం లేదనే మాట  అంతటా వినిపిస్తోంది. 

మరోవంక, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జోరు పెంచారు.ఇటు ప్రభుత్వ వ్యవహరాలలో అటు, పార్టీ కార్యక్రమాల్లో అయన సర్వం తానే అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో కేసీఆర్ ను పక్కన పెట్టి తానే స్వయంగా చక్రంతిప్పుతున్నారని,అంతరంగిక వర్గాల సమాచారంగా తెలుస్తోందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పేరున వెలువడుతున్న నిర్ణయాలు అన్నీ ఆయన స్వీయ  నిర్ణయాలు కాకపోవచ్చని, కేటీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పేరున వెలువడుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

ఇందుకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు,నిర్ణయాలు కేటీఆర్  తీసుకుంటారు, కేసీఆర్, మమ అంటారు అంటూ మర్మగర్భంగా వ్యంగ బాణాలు సంధించారు. అలాగే,  ఒక విధంగా చూస్తే, కర్తగా కేసీఆర్ ను పెట్టి కార్యం కేటీఆర్ కానిస్తున్నట్లుగా ఉందని పార్టీలోని మరి  కొందరు నాయకులు అంటున్నారు. 

ప్రతిపక్షాల రాష్ట్రపతి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపే విషయంలోనూ, కేసీఆర్  కు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదని, అయితే, కేటీఆర్ పట్టు పట్టుపట్టి, స్వయంగా సిన్హా నామినేషన్ కార్యక్రమాలో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి, అదే నిర్ణయం స్వయంగా కేసీఆర్ తీసుకుని ఉంటే స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి సిన్హా నామినేషన్ కార్యక్రంలో పాల్గొనే వారని, అయన వెళ్ళ లేదంటే అది అయన తీసుకున్న నిర్ణయం కాదని, అంటున్నారు. నిజానికి, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిల ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన నేపధ్యంలో, కేసీఆర్ తటస్థ వైఖరి తీసుకోవాలని అనుకున్నారని, పోలింగ్ కు ముందు వరకు మౌనంగా ఉండి చివర్లో ‘ఆత్మ ప్రభోదం’ మేరకు ఓటు వేయాలని, నిర్ణయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేయాలని, తద్వారా దళితులు, గిరిజనులకు తెరాస వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వాలని కేసేఅర్ ఆలోచన చేశారు. అందుకే, యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగానూ, ఆయన చెప్పవలసింది అంతా చెప్పి చివరకు, మనసులో ఉన్న. ఆత్మ ప్రభోదం మంత్రాన్నే బయట పెట్టారని, తెరాస నాయకుల సమాచారంగా ఉందని అంటున్నారు. 

ఇదలా ఉంటే, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేస్తుందనే భయం మొదలైందని అంటున్నారు. అందుకే యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, తాము కేంద్ర సర్కార్ ను పడగొడతామని  హెచ్చరించారని  అంటున్నారు.అంటే, మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణాలోనూ సంభవించే ప్రమాదం లేక పోలేదని, కేసేఆర్, అనుకుంటున్నారా? అనుమానిస్తున్నారా?  పార్టీలో చీలికకు అవకాశం ఉందనే అనుమానం ఏదైనా వుందా? అందుకే ఈ హెచ్చరిక చేశారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. 

నిజానికి, కేటీఆర్  దూకుడుకు కళ్ళెం వేసేందుకు అవసరం అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా ఒకవర్గం సిద్ధంగా ఉందని అంటున్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో,  కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వలన రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ  కూడా నష్టపోవలసి ఉంటుందని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు భయపడుతున్నారు.

అవునన్నా కాదన్నా, మనకు ఇష్టం ఉన్న లేకున్నా బీజేపీ జాతీయ పార్టీ,, కేంద్రంలో. సగానికి పైగా రాష్ట్రాల్లో ,అధికారంలో ఉన్న పార్టీ, అన్నిటినీ మించి బీజేపీ  ప్రస్తుత నాయకత్వం, మోడీ, షా జోడీ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతోంది. ఆ ఇద్దరి కన్ను పడితే, ఇక అంతే సంగతులు ... అనే భయం పార్టీలో కొందరు ముఖ్య నేతలు వ్యక్త పరుస్తున్నారు.

తెలంగాణపై మోడీ, షా కన్ను పడింది అనే విషయంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, ఓ వంక  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలోనే  లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ కంపెనీఆస్తులు రూ.92 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. కేటీఆర్ బీజేపీ జాతీయ నాయకుల్ని ఇలాగే  రెచ్చ గోడితే అటు నుంచి  ఇలాంటి దాడులు, జప్తులు  ఇంకా చాలా జరగుతాయని, దీనికి తెరాస ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తి తోడైతే, తెరాసను చీల్చడం పెద్ద పని కాకపోవచ్చని అంటునారు. అందుకే కేటీఆర్ దూకుడు తగ్గించుకోవడం మంచిందని, లేదంటే  అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అంటున్నారు.

By
en-us Political News

  
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.