కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేయాలనుకున్నాం: కేటీఆర్‌

Publish Date:Nov 15, 2018

Advertisement

 

తాజాగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ  నాలుగేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించారు. విభజన సమయంలో ఎన్నో అపోహలున్నప్పటికీ తెలంగాణను నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, తెలంగాణలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌ వేదికగా కేంద్రం పేర్కొన్న విషయాన్ని ఆయన‌ గుర్తు చేశారు. నేత కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని 3,400 గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమకారుడిగానే కాకుండా మంచి పాలకుడిగానూ నిరూపించుకున్నారన్నారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని ప్రచారం చేశారని, తలెత్తుకుని చెప్పుకునే విధంగా పాలించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచిందని చెప్పారు.

భావితరాలకు విద్యుత్‌కోత అనే పదం తెలియకూడదనే 24 గంటల సరఫరాకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను చరిత్ర పుటలకే పరిమితం చేయాలనే ఆలోచనతో ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభించామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం సగటున రూ.39.04కోట్లేనని.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో సగటున ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఇంజినీర్లే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో భూవివాదాలు, దందాలు లేకుండా చేశామన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనేదే లేకుండా చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడలేదన్నారు. పేకాట క్లబ్బులు, గుడుంబా స్థావరాలు లేవని, ఈ నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క అవినీతి మరకలేదని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉన్నామని, 8వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, స్కైవేల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. స్థానిక యువతకే 95శాతం ఉద్యోగాలిచ్చేలా కేసీఆర్‌ కృషి చేశారని, నాలుగేళ్లలో 100కోట్ల మొక్కలు నాటి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని, 40వేల చెరువులను పునరుద్ధరించామని, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని కేటీఆర్ అన్నారు.

ఒకానొక దశలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేయాలని కూడా అనుకున్నామని కేటీఆర్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్‌ వంటి నాయకుడు రాష్ట్రానికి 15ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నది తన ఆకాంక్ష అని వివరించారు. కేసీఆర్ దయవల్ల మంత్రినయ్యానని, ప్రస్తుతం ఉన్న మంత్రి పదవే పెద్దది అనుకుంటున్నానని అన్నారు. కేసీఆర్‌కు చెప్పకుండా జాబ్‌కు రిజైన్ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మళ్లీ ప్రజలకు కనిపించనని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిణతితో పనులు చేసుకుంటున్నారని తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ప్రధాని మోదీయే కితాబిచ్చారని చెప్పారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబులా ప్రచారం చేసుకునే అలవాటు టీఆర్ఎస్ కు లేదన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానంటూ చంద్రబాబు చెప్పుకునే మాటలు విని ప్రజలు నవ్వుకుంటారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లో ఎవరూ ఏం చేశారో నాలుగు ఏళ్లుగా హైద్రాబాద్ ప్రజలకు తెలుసునని.. డిసెంబర్ 7వ తేదీన  ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.