కేటీఆర్ సారూ.. మాట దాటేశారేంటి?

Publish Date:Oct 26, 2024

Advertisement

గత ఏడాది జనవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతే అప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల నుంచి  నిష్క్రమించేశారు. అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కూడా  మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యూహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టం అంటూ అంతా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు మాటలే మరిచిపోయి మౌనిలా మారిపోయిన పరిస్థితి. 

అయితే కేసీఆర్ మౌనం, ఆయన రాజకీయ ఇన్ యాక్టివ్ నెస్ బీఆర్ఎస్ కు శాపంగా పరిణమించింది. 
కేసీఆర్ మౌనం నేపథ్యంలో పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావులు నడిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తూ, రేవంత్ సర్కార్ విధానాలపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, మరీ ముఖ్యంగా హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామన్న భరోసా ఇస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అయితే అది సరిపోవడం లేదు. వారు ఎంత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నా కేసీఆర్ మౌనం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగిస్తున్నా వారికి ఎదురౌతున్న ప్రశ్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించేశారా అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయి. ఆ ప్రశ్నలకు వారి సరిగా బదులు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  

తాజాగా ఉబీపీ కాంక్లేవ్ లో పాల్గొన్న కేటీఆర్ కు కేసీఆర్ మౌనం, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండటంపై ప్రశ్న ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదా?  ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి కేటీఆర్ చెప్పిన సమాధానం ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. అంతే కాకుండా కేటీఆర్ మాట దాటేశారంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటంటే.. కేసీఆర్ ఓ అద్భుతమైన వ్యక్తి, ఆయన జీవితంలో చాలా చూశారు. ఆయనో ఉక్కు మనిషి.  ఏం జరిగినా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమి ఆయపై ఎలాంటి ప్రభావం చూపదు. చూపలేదు. అయినా.. మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు.. అంటూ తనకు అలవాటైన రాజకీయ ప్రసంగాన్ని ధారాళంగా చేసేశారు. అయన ఇంకా ఏమన్నారంటే..  మీరు కేసీఆర్ మౌనం గురించి కాదుకాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వాగ్దానం ఏమైంది?  వంద రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాల సంగతేంటి?  అని అడగాలి అని బదులిచ్చారు.  కేసీఆర్ ఏబీపీ కాంక్లేవ్ వేదికగా ఇచ్చిన ఈ సమాధనం పట్ల పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటదాటేశారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మౌనం గురించి అడిగితే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారంటున్నారు.  

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.