Publish Date:Jan 20, 2024
తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో కానీ, బయట కానీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతు వినిపించినా సహించలేదు. ఇచ్చిన వాగ్డానాలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకం అంటూ ఘనంగా చాటుకున్న కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపితే కొత్త ప్రాజెక్టులలో ఇవి సహజం అన్నారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీకైతే ఇప్పుడే ఇలా జరిగిందా అంటూ ఎదురు దాడికి దిగారు. అసలు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికే ప్రయత్నించిన బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నది.
ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధ్యమైనంత త్వరగా రేవంత్ సర్కార్ కు మంగళం పాడేసి అధికారం అందుకోవాలని తహతహలాడిపోతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో వాగ్దానాల అమలును తెలంగాణ ద్రోహులుగా ముద్రించేందుకు వెనుకాడని కేటీఆర్ ఇప్పడు అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీగా పట్టుమని 10 సంవత్సరాల చరిత్ర కూడా లేని బీఆర్ఎస్ వందేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ వంటి వారిని ఎందరినో చూశానంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు వంద రోజుల్లో హామీలు నెరవేర్చమని రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నది. తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యల గురించి కనీసం పట్టించుకోని కేటీఆర్ ఇప్పడుడు 50 రోజుల పాలనలో రేవంత్ పాలనలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని ఊరికే అనలేదు మరి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-question-revant-on-election-25-169094.html
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.