రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చకు ప్రవేశ పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గట్టిగానే నిలబడ్డారు. బలమైన వాదనలతో అసెంబ్లీలో నివేదిక తప్పుల తడక అని చెప్పే విషయంలో ప్రశంసార్హమైన విధంగా వాదనలు చేశారు. సరే చివరికి ఆదివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి సభ వేదికగా కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు చేసిన ప్రకటన బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. సీబీఐ చేతికి కాళేశ్వరం వెడితే.. బీజేపీ దానిని అవకాశంగా చేసుకుంటుందనీ, ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ను బలహీనం చేసి రాష్ట్రంలో బలపడుతుందనీ బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.
ఇది చాలదన్నట్లు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..సోమవారం (సెప్టెంబర్ 1) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించేశారు. అంతే కాదు.. ఆ అవినీతికి పాల్పడింది.. మాజీ మంత్రి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ లేనంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సుద్దపూస అని ఆయనను వెనకేసుకు వచ్చారు. ఇందుకు ఉదాహరణగా హరీష్ రావును కేసీఆర్ రెండో టర్మ్ లో ఇరిగేషన్ శాఖ నుంచి తొలగించడాన్ని చూపారు.
అయితే ఆమె ఎంతగా కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినా.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనిచెప్పడం ద్వారా, అప్పటి ప్రభుత్వాధినేత అయిన తండ్రి కేసీఆర్ ను చిక్కుల్లో పడేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక కవిత విమర్శలూ, ఆరోపణలూ రేవంత్ సర్కార్ వేయేనుగుల బలాన్ని అందించాయి. ఇక ముందు ముందు ఈ కేసులో సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరో గత్యంతరం లేదన్న భావనకు బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చి ఉంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఇంత కాలంగా కవిత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే మొతక వైఖరితో ఉంటారన్న అనుమానంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.
వాస్తవానికి చాలా కాలంగా కేటీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారనీ, ఈ మేరకు తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కవిత విషయంలో తండ్రి మళ్లీ చూసీ చూడనట్లు వదిలేయకుండా కేటీఆర్ సోమవారం (సెప్టెంబర్ 1) కవిత మీడియా సమావేశం తరువాత స్వయంగా ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆయన రాత్రంతా ఫామ్ హౌస్ లో తండ్రితో చర్చించారనీ, కవితను సస్పెండ్ చేయకుంటే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని నచ్చచెప్పి కవిత సస్పెన్షన్ కు కేసీఆర్ ను ఒప్పించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-pressure-on-kcr-behind-kavitha-suspenssion-39-205482.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.