Publish Date:Dec 24, 2024
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్రం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ప్రమేట్ చేసేవారు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాటి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్రం పొలిటికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. నిత్యం ఏదో వివాదంతో జాతీయ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం పతాక శీర్షికలలో నిలుస్తోంది.
ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా ఆంధ్రాను అధిగమించి తెలంగాణ రాజకీయ వివాదాల్లో అగ్రపీఠిన నిలుస్తోంది. రాజకీయ విమర్శలు ఓ స్థాయి దాటి దూషణల పర్వానికి వెళ్లాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు ప్రదర్శిస్తుంటే.. అంతకు మించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ, దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకు కోర్టు నుంచి తాత్కాలిక ఉపసమనం లభించింది. అయితే వెంటనే ఇదే విషయంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయం పక్కన పెడితే పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలుపై విడుదల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
అల్లు అర్జున్ వ్యవహారం తెరపైకి రాగానే కేటీఆర్ అరెస్టు, కేసుల విషయం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది. ఫార్ములా ఇ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచడం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతోందన్న వార్తలకు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ స్థానం లేకుండా పోయింది. ప్రజలు, మీడియా దృష్టి మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలిపోతుందా అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చిక్కులలో పడ్డారు అన్న చర్చకు తావే లేకుండా పోయింది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు విషయాన్ని జనం పట్టించుకోలేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-political-significance-fadeout-39-190285.html
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.