ఫార్ములా -ఇ కార్ లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా తన అరెస్టు అనివార్యం అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అరెస్టు భయం లేదు, ఒక వేళ అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి మరింత ఫిట్ గా తయారౌతానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా అరెస్టుకు కేటీఆర్ మానసికంగా రెడీ అయిపోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తన హయాంలో అంటే తాను మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఇన్వెస్టర్లకు ఎలా ప్రధాన గమ్యంగా మారిదో వివరించారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్రాలను, సాధించిన ఫలితాలను వివరించిన కేటీఆర్ పనిలో పనిగా ఫార్ములా - ఇ కార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. అలా ప్రస్తావించి ఊరుకోకుండా చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా -1 రేస్ నిర్వహణ కోసం జరిగిన ప్రయత్నాలను ప్రస్తావించారు. తద్వారా తాను చేసింది రైట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.
చంద్రబాబు ప్రయత్నానికి తాను చేసింది కొనసాగింపు మాత్రమేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫార్ములా -ఇ కార్ ను అడ్డుకోవడం ద్వారా రేవంత్ హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పేరు ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డిని డిఫెన్స్ లో పడేయాలన్నదే కేటీఆర్ ప్రయత్నంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
అదే సమయంలో కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. మొత్తం మీద కేటీఆర్ తనపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పేరును వాడేసు కుంటు న్నారు. ఫార్ముల వన్ రేస్ ల కోసం చంద్రబాబు ప్రయత్నాలకు ఇప్పడు కేటీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలకూ ఏ మాత్రం సంబంధం లేదని, చంద్రబాబును అడ్డుపెట్టుకుని బయటపడడానికి ప్రయత్నించడం సరికాదనీ, ఫార్ములా -ఇ రేస్ కుంభకోణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-desperete-to-save-himself-in-farmula-3-race-scam-25-188075.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.