Publish Date:Jun 12, 2025
కేసీఆర్.. వెంట్రుక కూడా పీకలేరు
గతంలో జగన్ కూడా సేమ్ డైలాగ్
తర్వాత ఏమైందీ???
వెంట్రుక ఈ డైలాగ్ లీడర్ జనానికి
ఎందుకంతగా కలసి రాదు!?
మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. సరిగ్గా అలాగే వెంట్రుకే కదా పీకలేరన్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటికల్ సిట్యువేషన్. మాములుగా పాములు పగబడతాయని అంటారు. సరిగ్గా అలాగే వెంట్రుకలు కూడా ఈ లీడర్ జనాల మీద పగబట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది. మొన్నటి ఏపీ ఎన్నికల సమయంలో జగన్ పాపులర్ డైలాగ్స్ ఏవని చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్, నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవన్నీ అప్పట్లో బాగా వైరల్.
తీరా ఎన్నికలయ్యాక జరిగిందేంటయ్యా అంటే జనం ఆయన్ను వై నాట్ 11 అంటూ తీసి అవతల పడేశారు. నన్నెవరూ ఏమీ పీకలేరు, పీకలేరు అని పదే పదే అన్న పాపానికి.. ఏకంగా అధికారంలోంచి పీకేయడమే కాకుండా.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఆయన ఎక్కడికైనా వస్తుంటే జనం చెప్పులు కూడా వేస్తున్నారు. తాజాగా పొదిలి పొగాకు రైతులకు వెన్నుదన్నుగా వచ్చినట్టు చెప్పిన జగన్ ర్యాలీలో ఈ ఘటన నమోదైంది. పొదిలి ప్రాంత పొగాకు రైతు మీద మాత్రమే వల్లమాలిన అభిమానం కుమ్మురించడానికి వచ్చిన జగన్ ఇలా అభాసు పాలయ్యారు... అది వేరే విషయం.
ఇక్కడ చెప్పొచ్చే నీతి ఏమిటంటే.. ఓవర్ యాక్షన్ తో కూడిన డైలాగులు , అతిశయంతో కూడిన సంభాషణా చాతుర్యాలు జనం పెద్దగా నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా ఓటు వేసే సమయంలో ఓటరు జనానికి ఇవన్నీ వారి వారి ఆలోచనల్లో చక్కర్లు కొడుతూ.. ఆ పార్టీకి కాకుండా ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేసేలా చేస్తున్నాయ్.
ఈ విషయం జగన్ విషయంలో ఒక సారి ప్రూవ్ అయినా సరే కేటీఆర్ ఇదేమీ గుర్తించకుండా తన తండ్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని అనడం... జనం కళ్లారా కంటున్నా చెవులారా వింటున్నారు.. ఇది వచ్చే రోజుల్లో మరింత సమస్యలకు దారి తెచ్చేలా కనిపిస్తోంది. రీసెంట్ గా వైనాట్ వన్ సెవెంటీఫైవ్ అనే ఈ స్లోగన్ రాసిచ్చినోడ్ని తన్నాలంటూ ఒక వైసీపీ నేత అనడం తెలిసిందే. జగన్ కి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఏమో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన ఓవరాక్షనే బెడిసికొట్టిందంటారు.
ఇప్పుడీ వింత వితండ వాదాన్ని కేటీఆర్ అందిపుచ్చుకోడాన్ని గులాబీశ్రేణులు కమాన్ గుస గుస అంటున్నాయ్. ఈయనకేమైనా పిచ్చిలేచిందా? ఇలాంటి డైలాగులు ఎందుకు కొడుతున్నారు. గతంలో జగన్ కి జరిగిన శాస్తి కనీసం గుర్తు కూడా లేదా అని మాట్లాడుకుంటున్నారట. ఈ ట్విట్టర్ రాజాకి ట్వీట్ కి ఏది బాగుంటే అది పెట్టడం.. నోటికి ఏది బాగుంటే అది మాట్లాడ్డం అలవాటైపోయింది. ఈ రోగానికి మందేదని అర్ధంగాక సొంత పార్టీ వారే బుర్ర గోక్కుంటున్నారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-arrogant-dilauges-39-199783.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.