Publish Date:Jun 12, 2025
కేసీఆర్.. వెంట్రుక కూడా పీకలేరు
గతంలో జగన్ కూడా సేమ్ డైలాగ్
తర్వాత ఏమైందీ???
వెంట్రుక ఈ డైలాగ్ లీడర్ జనానికి
ఎందుకంతగా కలసి రాదు!?
మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. సరిగ్గా అలాగే వెంట్రుకే కదా పీకలేరన్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటికల్ సిట్యువేషన్. మాములుగా పాములు పగబడతాయని అంటారు. సరిగ్గా అలాగే వెంట్రుకలు కూడా ఈ లీడర్ జనాల మీద పగబట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది. మొన్నటి ఏపీ ఎన్నికల సమయంలో జగన్ పాపులర్ డైలాగ్స్ ఏవని చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్, నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవన్నీ అప్పట్లో బాగా వైరల్.
తీరా ఎన్నికలయ్యాక జరిగిందేంటయ్యా అంటే జనం ఆయన్ను వై నాట్ 11 అంటూ తీసి అవతల పడేశారు. నన్నెవరూ ఏమీ పీకలేరు, పీకలేరు అని పదే పదే అన్న పాపానికి.. ఏకంగా అధికారంలోంచి పీకేయడమే కాకుండా.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఆయన ఎక్కడికైనా వస్తుంటే జనం చెప్పులు కూడా వేస్తున్నారు. తాజాగా పొదిలి పొగాకు రైతులకు వెన్నుదన్నుగా వచ్చినట్టు చెప్పిన జగన్ ర్యాలీలో ఈ ఘటన నమోదైంది. పొదిలి ప్రాంత పొగాకు రైతు మీద మాత్రమే వల్లమాలిన అభిమానం కుమ్మురించడానికి వచ్చిన జగన్ ఇలా అభాసు పాలయ్యారు... అది వేరే విషయం.
ఇక్కడ చెప్పొచ్చే నీతి ఏమిటంటే.. ఓవర్ యాక్షన్ తో కూడిన డైలాగులు , అతిశయంతో కూడిన సంభాషణా చాతుర్యాలు జనం పెద్దగా నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా ఓటు వేసే సమయంలో ఓటరు జనానికి ఇవన్నీ వారి వారి ఆలోచనల్లో చక్కర్లు కొడుతూ.. ఆ పార్టీకి కాకుండా ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేసేలా చేస్తున్నాయ్.
ఈ విషయం జగన్ విషయంలో ఒక సారి ప్రూవ్ అయినా సరే కేటీఆర్ ఇదేమీ గుర్తించకుండా తన తండ్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని అనడం... జనం కళ్లారా కంటున్నా చెవులారా వింటున్నారు.. ఇది వచ్చే రోజుల్లో మరింత సమస్యలకు దారి తెచ్చేలా కనిపిస్తోంది. రీసెంట్ గా వైనాట్ వన్ సెవెంటీఫైవ్ అనే ఈ స్లోగన్ రాసిచ్చినోడ్ని తన్నాలంటూ ఒక వైసీపీ నేత అనడం తెలిసిందే. జగన్ కి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఏమో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన ఓవరాక్షనే బెడిసికొట్టిందంటారు.
ఇప్పుడీ వింత వితండ వాదాన్ని కేటీఆర్ అందిపుచ్చుకోడాన్ని గులాబీశ్రేణులు కమాన్ గుస గుస అంటున్నాయ్. ఈయనకేమైనా పిచ్చిలేచిందా? ఇలాంటి డైలాగులు ఎందుకు కొడుతున్నారు. గతంలో జగన్ కి జరిగిన శాస్తి కనీసం గుర్తు కూడా లేదా అని మాట్లాడుకుంటున్నారట. ఈ ట్విట్టర్ రాజాకి ట్వీట్ కి ఏది బాగుంటే అది పెట్టడం.. నోటికి ఏది బాగుంటే అది మాట్లాడ్డం అలవాటైపోయింది. ఈ రోగానికి మందేదని అర్ధంగాక సొంత పార్టీ వారే బుర్ర గోక్కుంటున్నారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-arrogant-dilauges-25-199784.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.