Publish Date:Jun 13, 2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విచారణకు సహకరిస్తానంటూనే సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేశారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్న కేటీఆర్, పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. ఈ పరీక్షలను టీవీల్లో లైవ్గా చూపిద్దాం. లై డిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా..? రాష్ట్రం దివాళా తీసిందంటూనే పదేపదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు..? ప్రజాధనం వృథా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. సీఎం సిద్ధమా?
ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో ఈనెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ‘‘బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం ఇది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్గా చూపిద్దాం. లైడిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-39-199875.html
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.