కృష్ణం వందే జగద్గురుమ్!

Publish Date:Aug 26, 2024

Advertisement

దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ కొరకు యుగయుగాన తాను జన్మిస్తానని, ధర్మ సంస్థాపన కొరకు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రస్తుత మానవ సమాజానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఎన్నో మాటలు వేదవాక్కులుగానూ, జీవితానికి గొప్ప మార్గాన్ని చూపే సూత్రాలుగానూ ఉంటాయి. ఒక్కసారి భగవద్గీత చదివిన వాడిలో ఎంతో పరివర్తన కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎందుకంత గొప్ప గ్రంధమైంది?? అసలు కృష్ణుడు ఈ లోకాన్ని ఉద్ధరించడం ఎందుకు??

అసలు కృష్ణుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి?? 

చాలామంది కృష్ణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఎక్కడైనా చూశారంటే మిగిలిన దేవుళ్ళకు మ్రొక్కినట్టు మ్రొక్కరు. ఏదో షోకేస్ లో బొమ్మను చూసినట్టు చూస్తూ పోతారు. ప్రజానీకానికి అందుబాటులో ఉండే తొందరగా అందరికీ చేరవేయబడే సినిమాలలో కృష్ణుడిని కేవలం స్ట్రీలోలుడిగానూ, మాయలోడిగానూ చూపించడం వల్ల ఏర్పడిపోయిన భావమేమో!! కానీ సమాజం మాత్రం దాన్నే నమ్ముతుంది. కానీ కృష్ణుడు ఈ ప్రపంచానికి, ఈ మానవలోకానికి చెప్పిన మాటలు ఏంటి?? తను చెప్పిన తత్వమేంటి??

జైలు గోడలు మధ్య పుట్టినవాడు, చిన్నతనంలోనే తల్లి చనుబాల రుచి చూడకుండానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనవాడు, రాజ్యానికి రాజుగా రాజకుమారుడిగా పెరగాల్సినవాడు, గోకులంలో గోవుల మధ్య తిరగాడుతూ బ్రతికాడు. కృష్ణుడు సమస్తము తెలిసినవాడు అయినపుడు తన జీవితాన్ని గోకులానికి తరలించుకోవలసిన అవసరం ఏమైనా ఉందా?? కానీ కారణజన్ముడు కాబట్టి కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి వెళ్ళాడు. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపాడు. మరి ఆయనను భోగవిలాసుడు అనడం తగునా?? ఉన్ననాడు, లేనినాడు ఒకటిగానే బ్రతికేవాడు ఉత్తముడు.

16,000 మందిని భార్యలుగా స్వీకరించి వారికి ముక్తి కలిగించాడే కానీ ఎవరితోనూ శారీరక సంబంధం అనేది లేదు కృష్ణుడికి. చేసిందంతా కృష్ణుడే, మహాభారత మహాయుద్ధమైన కురుక్షేత్రానికి కారణం ఆయనే అంటారు కానీ పేరుకుపోయిన చెడును నిర్మూలించే దృష్ట్యా చేపట్టిన లోకసంరక్షణ కార్యమది అనే విషయాన్ని అంగీకరించరు ఎందుకో!! గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా, కాళీయుని పడగలపై నాట్యం చేసినా, మన్ను తిన్నా, వెన్న దొంగిలించినా, గోకులాన్ని పావనం చేసిన గోకుల కృష్ణుడు మధురను పునీతం చేయడానికి తరలిన తరువాత జరిగిన విషయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 

కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకే పాండవులకు మద్దతు ఇచ్చాడు. కానీ అందరూ అంటారు, మాయవి పాండవుల వైపే ఉంటాడు అని. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఉద్దండులు కౌరవుల వైపు ఉంటే కృష్ణుడు పాండవులవైపున్నాడు అంటారు. కానీ భీష్ముడు అయినా, ద్రోణుడు అయినా కట్టుబడిన నియమాలచేత కౌరవసేన వైపు నిలబడి పోరాడారు కానీ వారెప్పుడూ పాండవులకె వత్తాసు పలికారు.

ఇకపోతే శ్రీకృష్ణుని జీవితమంతా ఒక ఎత్తు అయితే భగవద్గీత బోధ మరొక ఎత్తు. అందులో ఏముంది అంటే జీవిత సారముంది. సగటు మనిషి తన జీవిత కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలి?? ఎందుకు నెరవేర్చాలి?? అసలు మనిషి ఎలా బ్రతకాలి, యోగమంటే ఏంటి?? ధ్యానం అంటే ఏంటి?? కర్మలు అంటే ఏంటి?? కర్మలు మనిషిని ఎలా వెంటాడుతాయి?? మోక్షం ఎలా సాధ్యం?? దానికి ఆచరించవలసినదేమిటి?? ఇలా ప్రపంచంలో మనుషులందరూ తెలుసుకోవలసినదాన్ని  అర్జునుడికి చెబుతున్నట్టు చెబుతూ అందరికోసం చెప్పాడు. అది సమర్థవంతమైన గురువు లక్షణం కదా మరి!!  గురువెప్పుడూ తన శిష్యులను నిందించడు ఉదాహరణలు చూపిస్తూ పరోక్షంగా శిష్యుల మనసులోకి విషయాన్ని చొచ్చుకుపోయేలా చేస్తాడు. అందుకే కృష్ణుడిని బెస్ట్ మొటివషనల్ పర్సన్ అంటారు, ఇక భగవద్గీతను గొప్ప మానసిక విశ్లేషణా గ్రంధం అని అంటారు. 

ఒకసారి గమనిస్తే కృష్ణుడు బాధపడుతున్న సందర్భం ఎక్కడా కనిపించదు. అలాగని విరగబడి నవ్వుతున్నట్టు ఎక్కడా ఉండదు. కేవలం పెదాల మీద సన్నని చిరునవ్వు పూయిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఆ నవ్వు చెదిరిపోకుండా ఉంటుంది. అదే స్థిరత్వం అంటే!!

కృష్ణుడు చెప్పేది అదే!! ఎలాంటి పరిస్థితిలో అయిన స్థిరత్వంగా ఉండాలని. 

                                         ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.