Publish Date:Jul 13, 2025
గణేశ్ సినిమాలో.. ఫేమస్ డైలాగ్. నేను బతకాలి తమ్మీ అంటూ ఆయన చెప్పిన డైలాగులకు అప్పట్లో యమ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయన ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట నట విశ్వరూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్రలను అవలీలలగా పోషించిన కొందరంటే కొందరు నటులలో కోట నటనకు పెట్టిన కోటే.. నిజంగా. సాధారణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జర్నలిజం, టీచింగ్, బ్యాంకు వంటి రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాటకాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ ఫైనల్ గా ఇక్కడ సెటిలవడం.
ఈ విషయంలో ఇప్పటికీ చాలా మంది కప్పదాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావడం సాధ్యమయ్యే పని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం కట్టకట్టి.. అటక మీద పడేసి.. ఎంచక్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయన.ఒక సమయంలో ఆయన బాబూ మోహన్ తో చేసిన మామగారు తరహా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ తర్వాత ఆయన సీరియస్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ లా ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించలేక పోయాడు కనీ.. ఇంచు మించు అలాంటి వర్సటైల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు.ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలాడి.. ఆ నాటకాల ప్రస్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా నటుడిగా ఎన్నో ఎత్తులకు ఎదిగి ఒక సమయంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజకీయంగానూ తన ప్రస్తానం కొనసాగించి.. చివరికిదిగో ఇలా తన జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట.
ఆయన తన నట జీవితంలో అన్ని కోరికలూ తీర్చుకుని వెళ్లారు. కానీ.. తన కొడుకు అర్ధాంతర మరణంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఇటు తనతో పాటు ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన బాబూ మోహన్ కి, తనకి ఇద్దరీ ఒకటే తరహా పుత్ర శోకం కలడం అత్యంత విషాద కరం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీరని లోటు. కారణమేంటంటే.. ఆయనలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడానికి ఆయనే మరోమారు నటకోటావతారం ఎత్తాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kota-srinivasa-rao-39-201910.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.