Publish Date:Jul 24, 2025
డిప్యూటీ సీఎం భట్టితో సంప్రదింపులు!
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రెండు రోజుల క్రితం కొండబాల కోటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగారు. గతంలో మధిర ఎమ్మెల్యే గా కూడా కొండబాల పనిచేశారు. దీంతో ఆయనకు అనుచరగణం కూడా ఉంది. భట్టితో భేటీ సందర్భంగా కొండబాల తనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో భట్టి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది.
కొండబాల అడిగిన దానికి భట్టి హామీ ఇవ్వలేననీ, ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే.. ఆరు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికి కొండబాల కూడా సుముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం కొండబాల తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అనుచరుల నుంచి పార్టీ మార్పునకు విముఖత వ్యక్తమౌతోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kondabala-koteswararao-to-join-congress-39-202628.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.