Publish Date:Aug 12, 2025
ఒకప్పటి కోమటిరెడ్డికి ఇప్పటి కోమటిరెడ్డికి చాలానే తేడా ఉన్నట్టుంది చూస్తుంటే. ఆయనకు ఇచ్చిన శాఖల్లో సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఒక పక్క అక్కడ సినీ కార్మిక లోకం వర్సెస్ నిర్మాతలుగా బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించు కుంటున్నారు. మూడేళ్లయ్యింది మాకు జీతం పెంచి అని కార్మికులు అంటుంటే, మీకసలు టాలెంటే లేదు. మేం ఐటీ ఎంప్లాయిస్ కన్నా ఎక్కువ వేతనాలిస్తున్నాం అని నిర్మాతలంటున్నారు. తొలి నుంచి సినీ పరిశ్రమ అవినీతి అడ్డా, అక్రమాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి చెందని నిర్మాత విశ్వ ప్రసాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .
ఒక వేళ కోమటిరెడ్డి ఏదైనా సమస్య తీస్కుని పోరాడాల్సి ఉంటే.. సినీ పరిశ్రమకు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూలడానికి క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావడం లేదంటారు కొందరు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్రభుత్వమే కూలాలని కోరుకుంటారు కానీ ఎక్కడో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వస్తుంది? అర్ధం కావడం లేదని అంటారు కొందరు.
మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా పదికాలాల పాటు ఉండాలని గణపతి పూజ చేయించానంటారు కోమటిరెడ్డి. కంటి ముందున్న పని పక్కన పెట్టి.. ఈ పూజల పిచ్చేందని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు. ఒక పక్క తమ్ముడు చూస్తే మంత్రి పదవి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా కనిపిస్తుంటే. మరో పక్క అన్న చూస్తే ప్రతిదానికీ పూజలకు లింకుబెట్టి మాట్లాడ్డం కనిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా జరుగుతోంది. ఉన్న సమస్యను పక్కన బెట్టి ఈ టాపిక్ డైవర్షనేంటన్న వాదన వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేషన్ శాఖ కూడా ఆయనది కాదు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జరుగుతుంటే అది పట్టకుండా కోమటిరెడ్డి ధోరణి ఇలా ఉందేమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddy-venkatareddy-occultism-alligations-trolled-by-netizens-39-204046.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.