Publish Date:Oct 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అజహరుద్దీన్ కి మంత్రి వర్గంలోకి చోటు కల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు కవర్ చేస్తూనే.. అటు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వారిని మరింత ఆకట్టుకునే యత్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే.. అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు... ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పటి రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్పటి వరకూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ దగ్గరే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవడంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా స్వామికార్యం- అంటే నవీన్ కార్యం కూడా పూర్తి చేయాలన్నది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటిలో మూడింటిని మాత్రమే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆలోచన. ఇప్పుడు అవసరానికి ఇందులో ఒక మంత్రి పదవి బయటకు తీశారు. మిగిలిన రెండింటి పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
దీంతో గత కొన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. అసలీ పార్టీలోనే ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారన్న వదంతి ఒకటి గుప్పు మంటోంది. ఇటు అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారో లేదో కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపార్టీ వీడేలా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇలాగే పార్టీ వీడి తర్వాత తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకూ ఆయనకున్న భావప్రకటనా స్వేచ్ఛకు కాంగ్రెస్ లో తప్ప మరెక్కడా వీలు కాదు. కాబట్టి.. ఆయన వెళ్తే వెళ్లాడు-మళ్లీ వచ్చేస్తాడులెమ్మన్నభావనలో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ పరిణామ క్రమాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddt-rajagopalreddy-angry-over-cabinet-39-208710.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.