Publish Date:Oct 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అజహరుద్దీన్ కి మంత్రి వర్గంలోకి చోటు కల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు కవర్ చేస్తూనే.. అటు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వారిని మరింత ఆకట్టుకునే యత్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే.. అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు... ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పటి రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్పటి వరకూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ దగ్గరే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవడంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా స్వామికార్యం- అంటే నవీన్ కార్యం కూడా పూర్తి చేయాలన్నది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటిలో మూడింటిని మాత్రమే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆలోచన. ఇప్పుడు అవసరానికి ఇందులో ఒక మంత్రి పదవి బయటకు తీశారు. మిగిలిన రెండింటి పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
దీంతో గత కొన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. అసలీ పార్టీలోనే ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారన్న వదంతి ఒకటి గుప్పు మంటోంది. ఇటు అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారో లేదో కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపార్టీ వీడేలా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇలాగే పార్టీ వీడి తర్వాత తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకూ ఆయనకున్న భావప్రకటనా స్వేచ్ఛకు కాంగ్రెస్ లో తప్ప మరెక్కడా వీలు కాదు. కాబట్టి.. ఆయన వెళ్తే వెళ్లాడు-మళ్లీ వచ్చేస్తాడులెమ్మన్నభావనలో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ పరిణామ క్రమాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddt-rajagopalreddy-angry-over-cabinet-25-208711.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.