ఎంతో సాధించి.. చివరికి పరువు కోసం ప్రాణాలు తీసుకున్న పల్నాటి పులి

Publish Date:Sep 16, 2020

Advertisement

నేడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. రూపాయి డాక్టరుగా పేదల మనసు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలనాటి అరాచకాలకు ఎదురు నిలిచి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి.. నరసరావుపేట కి నగిషీలు అద్ది, కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి పల్నాటి పులిగా పేరుతెచ్చుకున్నారు.

 

గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే 2 వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. ఆయన తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు.

 

పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని రాజాగారికోటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు కోడెల. ఆయన దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో ఆసుపత్రి గడప తొక్కేవారు. ఆయన పేదల డాక్టరుగా, రూపాయి డాక్టరుగా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దృష్టి కోడెల సేవపై పడి, 1983లో పార్టీలోకి ఆహ్యానించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల తెలుగుదేశంలో చేరారు. మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన స్పీకర్ గా పనిచేశారు. 

 

ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. వైఎస్‌ హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిని.. జైలుకు వెళ్లారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలంటూ నరసరావుపేట నుంచి కొండపైదాకా నడిచారు. కోటప్పకొండ ఆలయ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు.

 

స్వచ్ఛఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ లో భాగంగా కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.

 

ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న కోడెల పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. 11,987 మంది గుంటూరు జిల్లా ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.

 

టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. పార్టీ మారమని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా కించపరచినా ఎప్పుడూ పార్టీ మారలేదు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంతో సేవ చేసి.. పేదల మనిషిగా, పల్నాటిపులిగా పేరు తెచ్చుకున్న ఆయన.. కొందరు ఆయనపై వేసిన నిందలను, తప్పుడు ప్రచారాలను తట్టులోలేక.. మానసికంగా కృంగిపోయి.. గతేడాది ఇదే రోజున అవమానలను భరించలేక పరువుకోసం ప్రాణం తీసుకున్నారు.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.