Publish Date:Feb 10, 2020
పాలమూరు జిల్లాలో సహకార రాజకీయం రసవత్తరంగా మారింది. డీసీసీబి చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ లో రేస్ మొదలైంది. కుర్చీ దక్కించుకోవడానికి అన్ని స్థాయిల్లోని నేతలు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. హైకమాండ్ ప్రసన్నం చేసుకోడానికి ఆశావహులంతా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నేతలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార ఎన్నికల సమరం మొదలైంది. జిల్లాలో పీఏసీఎస్ లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. డిసిసిబి పై జెండా ఎగరేసేందుకు గులాబీ పార్టీ తహతహలాడుతోంది. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ లు లాబీయింగ్ మొదలుపెట్టారు. చోటా మోటా లీడర్ లు సైతం తమదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ లు, మునిసిపల్ చైర్మన్ లుగా అవకాశాలు రాని నాయకులు డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సహకార ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.
నిజానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి సహకార శాఖలో చాలా కీలకమైంది. ఈ పదవి పాలమూరులో ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల విభజన జరిగినా డిసిసిబి మాత్రం పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతోంది. ఫలితంగా ఈ పదవికి ప్రాధాన్యం గతంలో కంటే కూడా పెరిగింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజక వర్గాల్లో ఎనభై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇక్కడ డిసిసిబి పదవికి తీవ్ర పోటీ నెలకొంది, పదవి ప్రాధాన్యత దృష్ట్యా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తినే ఈ చైర్మన్ పదవికి ఎంపిక చెయ్యాలని అధిష్టానం భావిస్తోంది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు కేటీఆర్ ఆశీస్సుల కోసం హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు.
ఇక పాలమూరు డీసీసీబీ అధ్యక్ష పదవికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన హుస్నాబాద్ పీఏసీఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే గుర్నాథరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన కూడా డీసీసీబీ చైర్మన్ పదవిపైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలుకు చెందిన టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్క రఘునందన్ రెడ్డి కూడా డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ వద్ద ఈయన లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు జూపల్లి భాస్కరరావు, కొల్లాపురి నియోజకవర్గానికి చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబునగర్ నియోజవర్గం నుంచి కొరమాని వెంకటయ్య, బాలనగర్ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డిలు డిసిసిబి చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పాలమూరు డిసిసిబి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది మాత్రం ఇప్పటికైతే అంతుబట్టడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodangal-ex-mla-in-palamuru-dccb-chairman-race-25-94050.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.