Publish Date:Jun 18, 2025
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది.. బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకుర ప్రయత్నించిన నానిని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై బూతుల పంచాంగం విప్పేవారు. అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తరువాత నుంచీ నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థతి. గుడివాడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు. అసలు గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కొడాలి నాని బహిరంగంగా బయటకు వచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే అప్పడప్పుడు మీడియా ముందు కనిపించినా.. తాను భయపడటం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అంతే ఆ తరువాత నానికి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగివచ్చారు? అన్న సంగతే తెలియనంతగా అజ్ణాత వాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కోల్ కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలించే అవకాశాలున్నాయంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodalinani-arrested-in-kolkata-airport-39-200192.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.