Publish Date:Jun 18, 2025
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది.. బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకుర ప్రయత్నించిన నానిని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై బూతుల పంచాంగం విప్పేవారు. అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తరువాత నుంచీ నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థతి. గుడివాడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు. అసలు గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కొడాలి నాని బహిరంగంగా బయటకు వచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే అప్పడప్పుడు మీడియా ముందు కనిపించినా.. తాను భయపడటం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అంతే ఆ తరువాత నానికి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగివచ్చారు? అన్న సంగతే తెలియనంతగా అజ్ణాత వాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కోల్ కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలించే అవకాశాలున్నాయంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodalinani-arrested-in-kolkata-airport-25-200193.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.