Publish Date:Oct 22, 2025
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని.. తన సొంత పేరుతో కంటే.. బూతుల నానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.
ఆ తరువాత గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆయన కనిపించి, వినిపించి చాలా చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి నాని ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ణాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
ఇంతకీ కొడాలి నాని కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటనను ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్నినాని సహా పలువురు ఆయన స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో కొడాలి నాని ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి నాని తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్లుగా ఇంత కాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో ప్రారంభమైంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్థి పథకాల ప్రారంభం, అమలు కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి జగన్ తన వంతు ప్రయత్నంగా గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా చెలామణి అయ్యి.. ఇప్పుడు కేసుల భయంతో ముఖం చాటేస్తున్న వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కొడాలి నాని తన రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చినట్లేనా? ఇక ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తు వేగం పుంచుకుంటుందా? అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-with-ycp-leaders-in-gannavaram-25-208283.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.