Publish Date:Oct 22, 2025
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని.. తన సొంత పేరుతో కంటే.. బూతుల నానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.
ఆ తరువాత గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆయన కనిపించి, వినిపించి చాలా చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి నాని ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ణాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
ఇంతకీ కొడాలి నాని కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటనను ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్నినాని సహా పలువురు ఆయన స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో కొడాలి నాని ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి నాని తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్లుగా ఇంత కాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో ప్రారంభమైంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్థి పథకాల ప్రారంభం, అమలు కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి జగన్ తన వంతు ప్రయత్నంగా గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా చెలామణి అయ్యి.. ఇప్పుడు కేసుల భయంతో ముఖం చాటేస్తున్న వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కొడాలి నాని తన రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చినట్లేనా? ఇక ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తు వేగం పుంచుకుంటుందా? అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-with-ycp-leaders-in-gannavaram-25-208283.html
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.