Publish Date:May 23, 2024
మేక ఆకులు నమిలినట్టు నాన్స్టాప్గా గుట్కా నమలటం, చీకటి పడిన దగ్గర్నుంచి నుంచి అర్ధరాత్రి దాటే వరకు పీకల్దాకా తాగడం. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఎవరో ఒకర్ని తిడుతూ వుండటం.... ఇదీ కొడాలి నాని దినచర్య. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ వుంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి సడెన్గా ఫ్యూజ్ కొట్టేస్తుంది. ప్రస్తుతం కొడాలి నాని ఫ్యూజ్ ఉండనా, కొట్టేయనా అన్నట్టుగా వుందని సమాచారం. గుడివాడలో గురువారం ఉదయం తన పార్టీ నాయకులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, ఆయనకు వైద్యులు చికిత్స అందించడం గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందనే సమాచారం లేదు. సకల కళా వల్లభుడైన కొడాలి నాని ఆరోగ్యం పాతాళానికి చేరుకుందని మాత్రం తెలుస్తోంది.
కొడాలి నాని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి’’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఫలించి, దేవుడు కరుణించి కొడాలి నాని పూర్తిగా కోలుకుంటారని ఆశిద్దాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాదు.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అదేంటీ అనుకుంటున్నారా... అదే కొడాలి నాని విలన్గా ‘రంగస్థలం-2’.
‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సినిమా మొదట్లో విలన్ని ఎవరో చంపబోతుంటే హీరో కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే, దుర్మార్గుడైన విలన్కి ఎవరో శిక్ష విధించకూడదు.. తానే శిక్ష విధించాలి. అందుకోసమే కాపాడాడు. అలాగే, కొడాలి నాని విలన్ అయిన పొలిటికల్ ‘రంగస్థలం-2’ ప్రకారం, ఇప్పుడు కొడాలి నానికి ఏమైనా అయితే, ఆయన చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఎలా అనుభవిస్తాడు? అందుకే, ఆయన బతికుండాలి, గుడివాడ నియోజకవర్గంలో తన ఓటమిని స్వీకరించాలి. ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. అప్పటి వరకూ ఆయన క్షేమంగా వుండాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-should-safe-25-176699.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.