మెకానిక్‌ నుంచి మినిస్ట‌ర్ వ‌ర‌కూ.. కొడాలి నాని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. గుడివాడ ఎమ్మెల్యేగా ఆయన చాలా కాలంగా పని చేసినా.. జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మంత్రిగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి.. వినిపించే బూతుల పంచాంగంతో కొడాలి నాని పేరు  అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో పాపులర్ అయిందీ. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన క్యాసినో వ్యవహారం కాస్తా... సదరు మంత్రిగారికి పికకు చుట్టుకునేలా ఉందనే కామెంట్స్  సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.  

అసలు కొడాలి నాని ఎవరు.. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు. ప్రస్తుతం ఆయన వెలుగుతున్న ఈ వెలుగుల వెనుక  ఎవరు ఉన్నారంటే మాత్రం ఓ సారి వెనక్కి వెళ్లాలి... కృష్ణాజిల్లా గుడివాడలోని ఆటోనగర్‌లో కొడాలి నాని తండ్రికి మెకానిక్ షెడ్ ఉండేదని.. అయితే కొడాలి నాని.. స్వతహాగా పుస్తకం అంటే ఎలర్జీ అని.. ఆ క్రమంలో కొడాలి నాని.. పదవ తరగతికి ఫుల్ స్టాప్ పెట్టేశారని.. ఆ తర్వాత ఆయన పుస్తకం పట్టిందేలేదంటారు ఆయన చిన్ననాటి స్నేహితులు. ఆ క్రమంలో తండ్రికి చెందిన లారీ మెకానిక్ షెడ్‌కే కొడాలి నాని పరిమితమై... లారీనీ ఏ కీలుకాకీలు విప్పి..  వాటిని బిగించడంలో కొడాలి నాని మాంచీ నేర్పు సాధించాడంటారు.  

అదే సమయంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అటు గుడివాడ, ఇటు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన రెండు చోట్ల నుంచి గెలుపొందారు. ఆ సమయంలోనే గుడివాడలో కొడాలి నానికి నందమూరి హరికృష్ణతో కొంత పరిచయం ఏర్పడి.. అది కాస్తా స్నేహంగా మారిందని.. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ ఉత్తరాంధ్రలో మైనింగ్ వ్యాపారం చేస్తుంటే.. అందులోకి సైతం కొడాలి నాని ఎంట్రీ ఇచ్చి.. కొద్దో గొప్పో సంపాదించాడంటారు. ఇక గుడివాడ కేంద్రంగా ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లకు కొడాలి నాని సిటీ బస్సులను తిప్పే వారన్న సంగతి అందరికీ తెలిసిందే.  
 
అంతేకాకుండా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొడాలి నానిని హరికృష్ణ దగ్గరుండి మరి నియమించారని.. ఆ తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్.. గుంటూరులో చదువుకోవడం.. ఈ సమయంలో అతడి మంచి చెడ్డలన్నీ కొడాలి నానినే స్వయంగా చూసుకునేవాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ  పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణకు కేవలం 11 వేల ఓట్లు మాత్రమే పోలైనాయి. 

ఇక, 2004లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సిఫార్సుతో గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. కొడాలి నానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో కొడాలి నాని 7 వేల ఓట్లతో గెలుపొందారు. మళ్లీ 2009లో సైకిల్ పార్టీ టికెట్‌పై అదే నియోజకవర్గం నుంచి కొడాలి నాని విజయం సాధించారు. అయితే 2012లో కొడాలి నాని సైకిల్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని చేపట్టిన తర్వాత అయితే... కొడాలి నాని దూకుడు మ‌రింత పెరిగింది. లేటెస్ట్‌గా గుడివాడలోని కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు.. ఓ రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్ తీసుకొచ్చి.. మ‌హ‌నీయుల నేల‌ను అబాసుపాలు చేశారంటూ స్థానికులు మండిప‌డుతున్నారు. మంత్రి కొడాలి నాని మాత్రం అలాంటిదేమీ జరగలేందంటూ బుకాయిస్తున్నారు. రోటీన్‌గా బూతులు దండ‌కం అందుకున్నారు. ఏమైనా మంత్రిగారు చదివింది పదో క్లాస్.. అలా కాక ఇంకెలా చెబుతారంటూ.. గుడివాడ వాసులు గునుగుతున్నారు. 

By
en-us Political News

  
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు.
ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది
Publish Date:Apr 17, 2024
ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు? ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు
కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో కేసీఆర్ ప్రసంగంలో చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలపై బుధవారం ( ఏప్రిల్ 18) లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.