ఢిల్లీ పీఠం ఆప్ దే.. కేకే సర్వే అంచనా

Publish Date:Feb 5, 2025

Advertisement

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్కు జీరో నుంచి 3 స్థానా లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స తెలిపాయి. 

 కేకే సర్వే అయితే ఢిల్లీలో  ఆప్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆ పార్టీ పోటీ చేసిన 70 స్థానాలకు గాను 44 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీ 26 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు మృగ్యమని పేర్కొంది. ఇక హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలలో ఫలితం కొంచం అటూ ఇటైనా ఆప్ కచ్చితంగా 39, బీజేపీ 22 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో ఫలితం ఫొటో ఫినిష్ ఉంటుందని కేకే సర్వే పేర్కొంది. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 51 నుంచి 50 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అధికారంలో ఉన్న ఆప్ కేవలం 10 నుంచి 19 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరిచే అవకాశాలు  లేవని అంచనా వేసింది. 

ఐ మ్యాక్ త్రీ ఎగ్జిట్ పోల్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 24 నుంచి 36 స్థానాలలోనూ, బీజేపీ 41 నుంచి  43 స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తుందని అంచనావేసింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తారని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ బీజేపీ అధికారపగ్గాలు చేపడుతుందని పేర్కొంది. న్యూస్ ఆప్టిక్స్ కూడా బీజేపీకే అధికార పగ్గాలు అందుతాయని పేర్కొంది. ఆప్టిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ కు 24 నుంచి 28, బీజేపీకి 35 నుంచి 44 కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలలోనూ గెలుస్తుందని పేర్కొంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది.  

చాణక్య స్ట్రాటజీస్‌ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది.

By
en-us Political News

  
భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు.
విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో పాల్గొన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు విచారణలో భాగంగా ప్రశ్నించిన అధికారులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు.
విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది
బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది.
తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది.
మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.