కిరికిరి కిష‌న్!

Publish Date:May 22, 2025

Advertisement

ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రానికి ఏం చేశారో తెలీక ప‌రేషాన్ 

ఇప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ‌కు ఒక కేంద్ర‌మంత్రిగా కానీ, అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యేగా గానీ, సికింద్ర‌బాద్ ఎంపీగా గానీ కిష‌న్ రెడ్డి ఏం చేసిన‌ట్టు? అని గూగుల్ సెర్చ్  చేస్తే.. క‌నిపించే ఒకే ఒక్క ఆన్స‌ర్.. ఆయ‌న సీతాఫ‌ల్ మండీలో ఓపెన్ చేసిన ఒకే ఒక్క లిఫ్ట్. అంత‌కు మించి మ‌రేం క‌నిపించ‌ద‌ని అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రిగా కిష‌న్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంట‌న్న‌ది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లు పెడితే టీపీసీసీ  చీఫ్ మ‌హేష్ గౌడ్ వ‌ర‌కూ అంద‌రూ అడిగి చూశారు. నో ఆన్స‌ర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిష‌న్ రెడ్డి కిరికిరిల‌న్నీ ఇట్టే బ‌య‌ట పెట్టేస్తారు. అధికారంలో ఎవ‌రుంటే వారితో చెలిమి చేయ‌డం కిష‌న్ రెడ్డికి కాషాయంతో పెట్టిన విద్య‌గా చెబుతాడాయ‌న‌. దీంతో ఇదో దుమారం.

ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాక‌పోవ‌డానికి కిష‌న్ రెడ్డి అతి పెద్ద కారణంగా చెబుతారు. మోడీ తో ఇంత సాన్నిహిత్య‌ముండి.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఎందుక‌లా చేస్తార‌ని అడిగితే  అదంతే. అలా ఎప్ప‌టికీ ఉండ‌దంతే అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  అదేమంటే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింద‌న్న ప్రెజంటేష‌న్లు ఇచ్చి మ‌మ అనిపించేస్తారు కిష‌న్ రెడ్డి. ఇవి కాదు మీరు మీరేం చేశారో చెప్పాల‌ని నిల‌దీస్తారు కాంగ్రెస్ లీడ‌ర్లు. మొన్న‌టికి మొన్న కాంగ్రెస్.. ఒక అఖిల ప‌క్షం వేస్తే అందుకూ డుమ్మా కొట్టారు కిష‌న్ రెడ్డి. అదేమంటే త‌న‌కు లేటుగా తెలిసింద‌ని తేల్చేశారు. ఇక‌పై ముందుగా చెప్పండి వ‌స్తాన‌ని క‌వ‌ర్ చేశారు. ఈ మేనేజ్మెంట్ మెంటాల్టీ ఆయ‌న‌కు తొలినాటి నుంచి  ఉంద‌ని అంటారు. 

దీనంత‌టికీ కార‌ణ‌మేంటి? ఒక య‌డ్యూర‌ప్ప‌లా ఇక్క‌డ కూడా కిష‌న్ రెడ్డి ఎందుకు ఎద‌గ‌లేక పోతున్నారు? పార్టీని అధికారంలోకి ఎందుకు తేలేక పోతున్నారు? అని చూస్తే ఆయ‌న‌కు అధికారంలో ఉండ‌టం క‌న్నా ఇలా కేంద్రంలో ఏదో ఒక మంత్రి ప‌ద‌వితో.. రాష్ట్రంలో ఉన్నామంటే ఉన్నామ‌న్న పాత్ర పోషించ‌డ‌మే చాలా చాలా ఇష్ట‌మ‌ని అంటారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి గ‌త కొంత‌కాలంగా ఖాళీ ఉందిక్క‌డ‌. ఈట‌ల‌కు ఈ పోస్టు దాదాపు ఖ‌రారైతే.. మోకాల‌డ్డేసిన ఘ‌న‌త కూడా కిష‌న్ రెడ్డి పేరిటే లిఖించ‌బ‌డి ఉంద‌ని అంటున్నారు. ఒక వేళ ఈట‌ల అధ్య‌క్షుడిగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్తే అదెక్క‌డ ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించే వ‌ర‌కూ వెళ్తుందోన‌ని.. త‌న పాత బ్యాచ్ మొత్తాన్ని పోగేసి కొత్త వ్య‌క్తి అధ్య‌క్షుడు కాకుండా కిష‌న్ రెడ్డి కిరికిరి చేసిన‌ట్టు చెప్పుకుంటున్నారంతా. 

గ‌తానికి వ‌ర్త‌మానానికి తేడా చూస్తే ఒక‌ప్పుడు తెలంగాణ‌ అసెంబ్లీలో ఒకే ఒక్క‌డిగా ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడు 8 మంది వ‌ర‌కూ చేరింది. ఎంపీల సంఖ్య కూడా 8కి చేరింది. మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ రాణింపు. ఇక గ్రేట‌ర్ లో బండి హ‌యాంలో 4 నుంచి సుమారు 50 వ‌ర‌కూ చేరింది. కానీ వీరిలో ఏ ఒక్క‌రిలోనూ మ‌రొక‌రికి స‌ఖ్య‌త ఉండ‌దు. పాత కొత్త బ్యాచ్ లు వేరు వేరు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రూపులు వేరు వేరు. ఇలా ర‌క‌ర‌కాల గ్రూపులుగా పార్టీ త‌యార‌య్యి.. అదో క‌ప్ప‌ల త‌క్కెడ‌గా మారింద‌ని స‌మాచారం. దీనంత‌టికీ కార‌ణం కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్ వంటి వారు.

ఇక్క‌డ కూడా ఏపీలా ఒక కూట‌మి క‌ట్టి.. ఎలాగైనా అధికారంలోకి రావ‌చ్చ‌ని భావిస్తుంటే.. అందుకు మోకాల‌డ్డుతున్న‌ది కూడా కిష‌న్ రెడ్డేనంటారు. కార‌ణం ఇప్ప‌టికే అక్క‌డ త‌మ జ‌గ‌న్ రెడ్డిని ఓడించిన కూట‌మి అంటేనే కిష‌న్ రెడ్డి కి కోపం చిరాకు. అలాంటి కూట‌మితో ఇక్క‌డా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మా? న‌థింగ్ డూయింట్ అంటున్నార‌ట కిష‌న్ రెడ్డి. అదేమంటే రేవంత్ రెడ్డి.. టీడీపీ- బీజేపీ- జ‌న‌సేన కూట‌మిక‌ట్ట‌డాన్ని అడ్డుకుంటున్న‌ట్టు ఒక రూమ‌ర్ వ‌దిలి... నిందంతా ఆయ‌న‌పైకి తోసేస్తున్నార‌ట కిష‌న్ రెడ్డి. 

అంటే రాష్ట్రంలో పార్టీ దానంత‌ట అది మోడీ హ‌వాలో ఓట్లు, సీట్లు సాధించ‌డం త‌ప్ప‌.. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం.. అధ్య‌క్ష స్థాయిలో చేసిన కృషిని అనుస‌రించి తెచ్చిన విజ‌యం కిష‌న్ రెడ్డి పేరిట ఒక్క‌టీ ఉండ‌ద‌ని అంటారు.. కాల‌సాపేక్ష సిద్దాంతం.. అంటే పార్టీలో అధిక కాలం ఉండ‌టం వ‌ల్ల వ‌చ్చే ప‌ద‌వుల‌ను అనుభ‌వించి అక్క‌డితో ముగిద్దాం అన్న ధోర‌ణి త‌ప్ప‌.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ‌డాన్ని కిష‌న్ రెడ్డి పెద్ద‌గా ఆస్వాదించ‌ర‌ని తెలుస్తోంది.

కార‌ణం అదే ఇత‌ర పార్టీలు అధికారంలో ఉంటే వారితో లాలూచీ ప‌డి.. అడ్డంగా సంపాదించుకోవ‌చ్చు. ఎవ‌రూ అడిగే వారుండ‌రు. ఒక వేళ త‌మ పార్టీ స్వ‌యానా అధికారంలో ఉంటే ఫోక‌స్ అంతా మ‌న మీదే ఉంటుంది కాబ‌ట్టి.. ఆ ఊసే వ‌ద్ద‌ని అంటార‌ట కిష‌న్ రెడ్డి. అలాంటి అవ‌కాశం ఇత‌రుల‌కు వ‌చ్చినా.. దాన్ని త‌న‌కున్న పాత ప‌రిచ‌యాల‌తో ఎలాగోలా మేనేజ్ చేసి చెక్ పెట్ట‌డంలో ఆరితేరిన నిపుణుడట కిష‌న్ రెడ్డి.

త‌న మొత్తం కెరీర్ లో కిష‌న్ రెడ్డి నేర్చుకున్న విద్యే ఇదేన‌ట‌. పార్టీని అధికారంలోకి తెస్తే ఎంత? తేకుంటే ఎంత‌? అదే ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో కుమ్మ‌క్కై నాలుగు రాళ్లు వెన‌కేసుకోక ఏంటీ చాద‌స్త‌మ‌ని మొహం మీదే అడిగేస్తార‌ట‌ కిష‌న్ రెడ్డి. 

కిష‌న్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే అది ఇదేనంటారు. గ‌తంలో ఇటు కేసీఆర్, అటు జ‌గ‌న్ తో బాగా ద‌గ్గ‌ర‌య్యి.. వారి ద్వారా కావ‌ల్సినంత వెన‌కేశార‌ట కిష‌న్ రెడ్డి. అందుకే ఈ సారికి పార్టీ నుంచి పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న ఉండ‌కూడ‌ద‌ని చెప్పి పైన త‌నకున్న‌ ప‌లుకుబ‌డితో అధ్య‌క్ష ప‌ద‌వి సాధించార‌ట‌. అప్పుడే అనుకున్నారంతా.. ఈ సారి ఎన్నిక‌లకు కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌లో వెళ్ల‌డం అంటే అది ఓట‌మిని కొని తెచ్చుకోవ‌డ‌మ‌ని. 

ఇలా కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయ‌క‌, పార్టీకి ఏం చేయ‌క‌.. అధికారంలోకి తెచ్చే దారిలేక‌.. ఎవ‌రైనా ఆ ప్ర‌య‌త్నం చేస్తుంటే చూస్తూ ఓర్చుకోలేక.. ఒకరంగా సైంధ‌వుడి పాత్ర పోషిస్తున్న‌ట్టుగా మాట్లాడుకుంటున్నారు పార్టీలో.. అందుకే ఆయ‌న‌కు కిరికిరి కిష‌న్ రెడ్డి అని పేరుపెట్టుకుని.. త‌మ అక్క‌సు మొత్తం తీర్చుకుంటున్నార‌ట రాజాసింగ్ లాంటి కొంద‌రు. మ‌రి చూడాలి త‌న‌పై వ‌స్తున్న ఈ ఆరోప‌ణ‌ల‌కు కిష‌న్ రెడ్డి ఎలాంటి స‌మాధానం ఇస్తారో. తెలాల్సి ఉంది.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.