ఇంతకీ సమైక్య చాంపియన్ ఎవరో

Publish Date:Oct 15, 2013

Advertisement

 

ఇప్పుడు రాష్ట్రంలో సమైక్యవాదంపై పేటెంట్ హక్కుల కోసం గట్టి పోరాటం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరియు లగడపాటి రాజగోపాల్ ఈపోటీలో ముందున్నారు. అయితే, ఈ పోటీ ప్రధానంగా మొదటి ఇద్దరి మధ్యే ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే.

 

ఈ ఇద్దరిలో ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన అధిష్టానాన్నిదిక్కరిస్తూ సమైక్యగీతం ఆలపిస్తున్నకారణంగా సహజంగానే జనాలలో కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకొని ఈ రేసులో ముందున్నారు. మరి ఆయన నిజాయితీగానే ఈ సమైక్యగీతం ఆలపిస్తున్నారా లేక అధిష్టానం స్వరపరచిన ట్యూన్స్ పట్టుకొని పాడుతున్నారా లేక రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తన కుర్చీకి డోకా లేకుండా చూసుకోనేందుకే ఈపాట అందుకొన్నారా లేక తన నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొని నిలబడేందుకే ఈ పాట పాడుతున్నారా అనే ధర్మ సందేహాలు పక్కన బెడితే, ఆయన రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టం అవుతున్నపటికీ ఆయనే సమైక్యరాగం గట్టిగా ఆలపిస్తూ దానిపై పూర్తి పేటెంట్ హక్కులు తనవేనంటున్నారు. అయితే ఆయన పార్టీలో ఉన్నాబయటకు వెళ్లి వేరే కొత్త కుంపటి పెట్టుకొన్నాకూడా అంతిమంగా ఆయన, కాంగ్రెస్ పార్టీయే లభాపడతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి దూకుడుగానే పావులు కదుపుతున్నారు. జైలు నుండి బయటకు వచ్చీ రాగానే, తన పార్టీ ఆలపిస్తున్నసమైక్యరాగంలో మరికొన్నికొత్తరాగాలు జోడించి గొంతెత్తి పాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పాటకి కిరణ్ కుమార్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతూ శృతి తప్పిస్తున్నారు.

 

ఉద్యోగులతో కలిసి కోరస్ పాడి జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలని జగన్ ప్రయత్నిస్తే, పైలీన్ తుఫాను పేరు చెప్పి వారిని సమ్మె విరమింపజేయడంతో ఆయన ఒక్కడే ఒంటరిగా విషాద గీతం పాడుకోక తప్పలేదు. పోనీ ఆమరణ దీక్ష చేసుకొంటూ ఆయన పాడిన సమైక్య రాగాన్ని, అదొక కూనిరాగమన్నట్లు దానికి నామమాత్రంగా కూడా స్పందించకుండా నూటొక్క దీక్షల్లో ఇదీ ఒకటి అన్నట్లు తీసిపారేయడంతో వ్రతం(దీక్ష) చెడినా ఫలం దక్కకుండా పోయింది.

 

పోనీ హైదరాబాదులో ఓ ఐదు లక్షల మందిని పోగేసి వారి ముందు సమైక్యరాగం తీద్దామనుకొంటే, శాంతి భద్రతలంటూ కాలు అడ్డం పెడుతున్నాడని కోర్టుకు మోర పెట్టుకొనే పరిస్థితి కల్పించారు. పోనీ “ఇదే పాట ఇదే నోట వేరే ఊళ్ళో పదే పదే పాడుకొంటాను. కనీసం అందుకయినా నా బెయిలు షరతులు సడలించండి మహాప్రభో” అని కోర్టుకు విన్నవించుకొన్నారు.

 

ఒకవేళ కోర్టు ఆయన సీమాంద్రాలో కచేరీ చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోతే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన జీవితాన్నే మార్చేసే ఒక సరి కొత్త ఐడియా వెంటనే అమలుచేయక తప్పదు. లేకపోతే ఇంతకాలం ఎంతో రిస్కు తీసుకొని పాడిన సమైక్యరాగం కాస్తా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మిగిలిపోతుంది. పైగా అది కాంగ్రెస్ స్వరపరిచిన గీతం కాకపోయి ఉంటే, పార్టీలోను ఆయనకు తాళం తప్పవచ్చును.

 

ఈ రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాడుతున్నది ఒకటే పాట అయినప్పటికీ వేర్వేరు రాగాలు, తాళాలు వేస్తూ ఆలపిస్తూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి జనాలు రాబోయే ఎన్నికలలో వీరి పాటకు తాళం వేస్తారో లేక ఇద్దరూ సమైక్యరాగం తీస్తూ రాష్ట్ర విభజన చేసి పెట్టినందుకు ఇద్దరికీ గోడ్రేజ్ తాళం వేసేసి, అందరి కంటే సీనియర్ సమైక్య రాగాలాపకుడయిన ఏ లగడపాటినో లేక వేరెవరినో మేళ తాళాలతో స్వాగతం పలుకుతారో చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.