మరో తప్పుకి సిద్దమవుతున్న కిరణ్

Publish Date:Jun 17, 2014

Advertisement

 

ఒకప్పుడు అందు లేడు..ఇందు లేడు అనే సందేహం వలదన్నట్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి కనబడకుండా అదృశ్యమయిపోయారు. ఆయన మీడియా భారి నుండి తప్పించుకొనేందుకు ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకొంటున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి సన్నిహితంగా ఉండే కొందరు గుజరాతీ పారిశ్రామికవేత్తలకు ఆయన సహాయపడ్డారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు వారి ద్వారా నరేంద్ర మోడీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తాజా సమాచారం.

 

ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని ఉంది ఉంటె ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. ఆక్షేపించేవారు కాదు. పార్టీ శ్రేయోభిలాషిగా ఆయన చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓటమి భారంతో క్రుంగిపోతోంది గనుక ఒకవేళ ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపితే తప్పకుండా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి ఉండేది. కానీ పొరపాట్లు చేయడం అలవాటుగా మారినందునేమో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే ఆలోచన ఆయన ఎన్నికలకు ముందు, తెదేపాతో బీజేపీ పొత్తులు ఖరారు కాక ముందు చేసి ఉండి ఉంటే బహుశః నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఆ సమయంలో సీమంద్రాలో బీజేపీని నడిపించేందుకు సమర్దుడయిన నాయకుడు లేక అల్లాడుతున్న బీజేపీ, బహుశః ఆయనకే ఆ భాద్యతలు కట్టబెట్టి ఉండేదేమో! అప్పుడు బీజేపీ తెదేపాతో పొత్తుల గురించి ఆలోచించేదే కాదేమో!

 

సమయం కాని సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అందెవేసిన కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరాలనుకొంటే అది ఆయన రాజకీయ జీవితంలో మరొక ఘోర తప్పిదం అవుతుంది. ఎందువలన అంటే, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు ఇంతవరకు మొహం కూడా చూడని బీజేపీ నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబుతో వినయంగా మెలగ వలసి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకీ రాష్ట్రంలో కాని కేంద్రంలో గానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరితే అందులో ఒక అనామకుడిగా మిగిలిపోవచ్చును. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.