కిరణ్ రోడ్డు మ్యాపే అధిష్టానం ఫాలో అవుతుందా!

Publish Date:Jul 12, 2013

Advertisement

 

ఇంత వరకు తెలంగాణా అంశంపై నిర్ణయం చేసే బాధ్యత అధిష్టానం మీదనే ఉందంటూ, ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా నిశ్చింతగా కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రోడ్డు మ్యాప్ తయారు చేయమని దిగ్విజయ్ సింగ్ ఆదేశించినప్పటి నుండి రాష్ట్ర విభజన సమస్య తలకి చుట్టుకొన్నట్లయింది. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉందని చెప్పవచ్చును. వారిద్దరూ సమైక్యవాదులయినప్పటికీ, కీలకమయిన పదవులలో ఉన్నందున, ఇంత కాలం తెలంగాణా అంశం తమ చేతుల్లో ఏమీ లేదని, అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకొంటామని చెబుతూ, పెద్దగా ఇబ్బంది కలగకుండానే రోజులు దొర్లించేసారు.

 

అయితే, ఈ రోజు రాష్ట్ర విభజనపై ప్రకటనకి ముహూర్తం ఖరారయిపోవడంతో, వారిద్దరూ తమ వైఖరి కూడా ప్రకటించక తప్పట్లేదు. వారు బహుశః ఇప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకే మొగ్గు చూపుతున్నపటికీ, సీమంధ్రా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా తమ ప్రాంత నేతల మనోభావాలను అధిష్టానానికి తెలియజేసి తదనుగుణంగా నిర్ణయం వచ్చేలా కృషి చేయక తప్పట్లేదు. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మఖాం వేసిన సీమంధ్ర నేతలని కలిసిన వెంటనే, అక్కడి నుండి నేరుగా సోనియా గాంధీని కలిసి రావడం జరిగింది. అంటే, ఆయన వారి అభిప్రాయాలను, నిర్ణయాలను అధిష్టానానికి చేరవేసినట్లు భావించవచ్చును. కానీ అక్కడే మఖాం వేసి ఉన్న టీ-కాంగ్రెస్ నేతలని మాత్రం ఆయన కలిసినట్లు ఎటువంటి సమాచారం లేదు.

 

అందువల్ల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జోరుగా లాబీయింగ్ చేస్తునట్లు భావించవచ్చును. ఈవిధంగా సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశానికి ముందే, వారిరువురూ పార్టీ అధిష్టానంపై ఇంత తీవ్రమయిన ఒత్తిడి తెస్తే, ఆ సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశం తరువాత, మళ్ళీ తెలంగాణపై నాన్పుడు ధోరణి అవలంభిస్తే, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయనే కారకులని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు భావించడం ఖాయం, తత్ఫలితంగా వారిరువురికీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీవ్రవ్యతిరేఖత ఎదురవడం కూడా అంతే ఖాయం. మరి కాంగ్రెస్ అధిష్టానం వారిరువురుకి అటువంటి పరిస్థితి కల్పిస్తుందో లేక తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందో ఈ రోజు సాయంత్రం సమావేశం ముగిస్తే గానీ తెలియదు.

By
en-us Political News

  
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.