మోదీ సర్కార్ పై ఖర్గే ఫైర్.. 11 ఏళ్లు 33 తప్పులు !

Publish Date:Jun 12, 2025

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే..  వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము. అయితే..  వరసగా మూడవ సారి దేశ ప్రజలు మోదీని మెచ్చి ఓటేసి గెలిపించారు, సో ..మోదీ తొలి పదేళ్ళ పాలన ప్రజలకు నచ్చింది. అందుకే, ముచ్చటగా మూడవసారి మోదీకి పట్టం కట్టారు,అనుకోవచ్చును. ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రామాణికం కాబట్టి, మోదీ తొలి పదేళ్ళ పాలనకు పాస్  మార్కుల కంటే, కొంచెం మెరుగైన మార్కులే ప్రజలు ఇచ్చారు. 

నిజానికి..  వరసగా మూడవ సారి అధికారంలోకి రావడం ఒక చారిత్రక విజయమే అయినా..  2014, 2019 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే.. మోదీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. బీజేపీ, ఎన్డీయే స్కోర్ దిగి వచ్చింది. 2014లో 284 స్కోర్’తో.. 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒంటరిగానే మెజారిటీ సాధించిన  బీజేపీ 2019లో మరో మెట్టు పైకి ఎక్కింది బీజేపే ఒంటరిగా 303 సీట్లు గెలిచి చరిత్రను సృష్టించింది. అయినా.. సంకీర్ణ ప్రభుత్వాలనే కొనసాగించింది  అనుకోండి అది వేరే విషయం. అలాంటి బీజేపీ స్కోర్  2024లో 240 కి పడిపోయింది. అంటే 63 సీట్లు కోల్పోయింది. అయినా..  ఎన్డీఎ మిత్ర పక్షాల అండతో ఏర్పాటైన  సంకీర్ణ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.

సహజంగానే..  అధికార బీజేపీ,ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నాయకులు, మోదీని  మెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగిందని అభివర్ణించారు. అలాగే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు,ఎన్డీయే ముఖ్యమంత్రులు మోదీ 11 ఏళ్ల పాలనను ఆహా ..ఓహో అంటూ మెచ్చుకునన్నారు. అదేమంత విశేషం కాదు. మోదీ పాలన ఎన్డీయేకి  ముద్దు.  

అలాగే..  విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, మోదీ పాలన అస్సలు నచ్చలేదు. అది కూడా సహజమే. అందుకే కాంగ్రెస్ సర్వాధికారి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను సింపుల్ గా ఛీ  కొట్టారు. మోదీ ప్రభుత్వాన్ని కలల ప్రభుత్వంగా అభివర్ణించారు. వర్తమానాన్ని వదిలేసి..  2047 గురించి కలలు పంచి, దేశాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. 

మరోవంక..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మరో అడుగు ముందుకేసి  మోదీని మోసాల పుట్టగా అభివర్ణించారు. మోదీ 11 ఏళ్ల పాలనలో  దేశానికి జరిగిన మేలు శూన్యమని తేల్చేశారు. 11 ఏళ్లలో 33 తప్పిదాలు చేశారని  మోదీ తప్పుల చిట్టాను వినిపించారు.  గతంలో పార్లమెంటులో కూడా తాను ఇదే మాట చెప్పిన సంగతిని గుర్తు చేశారు.  ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం, యువకులను మోసం చేయడం, పేదలను కడగండ్లపాలు చేస్తున్న ఇలాంటి ప్రధానిని  తమ రాజకీయ జీవితంలోనే చూడలేదని, ఖర్గే పేర్కొన్నారు.

ఇక అక్కడి నుంచి  ఖర్గే  ఆయనే చెప్పినట్లుగా, పార్లమెంట్ లోపలా బయటా చాలా కాలంగా చెపుతూ వచ్చిన  సంగతులనే మరోమారు వల్లె వేశారు. డిప్యూటీ స్పీకర్ సహా  విపక్షాలకు మోదీ ఏ చిన్న పోస్ట్ ఇవ్వడం లేదు అని మొదలు పెట్టి  ఈడీ దాడుల వరకు.. మోదీ ప్రభుత్వం  మొత్తం 33 తప్పులు చేసిందని ఎత్తిచూపారు. 

అయితే..  మోదీ 11 ఏళ్ల పాలనను అధికార విపక్షాలు, ఎలా చూసినా, ఏమనుకున్నా  తాజాగా, నిర్వహించిన మూడ్ అఫ్ డి నేషన్ సర్వే లు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ  ఎన్డీయేదే అధికారమని చెపుతున్నాయి. అంతే కాదు  2024 కంటే, ఈసారి.. బీజేపీ సొంత సంఖ్యా బలంతో పాటుగా ఎన్డీయే సంఖ్యా బలం కూడా పెరుగుతుందని చెపుతున్నాయి.  ఇండియా టుడే 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో  బీజేపీ 281 సీట్లతో సింపుల్ మెజారిటీ మార్క్  (273) క్రాస్ చేస్తుందనీ, అలాగే..  ఎన్డీఎ 343 సీట్లు గెల్చుకుంటుందని దీంతో  కాంగ్రెస్,ఇండియా కూటమి బలం తగ్గుతుందని సంకేతాలు ఇస్తోంది.  కాంగ్రెస్ బలం  99 నుంచి  78కి, ఇండియా కూటమి నెంబర్ 232 నుంచి 184కు పడిపోతుందని సర్వే చెపుతోంది. అలాగే..  తాజగా ఆపరేషన్ సిందూర్ తర్వాత నిర్వహించిన మరో సర్వేకూడా బీజేపీ, ఎన్డీయే కే జై కొడుతున్నది.. సో  11 ఏళ్ల మోదీ పాలనకు  ఇప్పటి వరకు అయితే  ప్రజామోదం పుష్కలంగానే ఉన్నట్లుంది. సందేహం లేదు. అయితే.. ఎన్నికలకు ఇంకా నిండా నాలుగు సంవత్సరాల సమయం వుంది. ఈలోగా ఏమైనా జరవచ్చును.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.