విజయం కావాలంటే యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు!

Publish Date:Aug 12, 2022

Advertisement

ఆగష్టు 12న అంతర్జాతీయ యువ దినోత్సం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యువతలో లోపించేది నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. యువత చిన్న చిన్న వాటికి నిరుత్సాహానికి లోనవుతుంటారు. ఏమి చేస్తే విజయం సాధించగలమో, యువతకు చదువు ఎంత అవసరమో, మానసిక పరిణితి ఎలా ఉండాలో తెలుసుకుంటే యువత ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. అందుకే యువతను ఉత్తేజపరిచే వాక్య ప్రవాహంలోకి వెళ్లాలిప్పుడు!!

సమాజంలో మనం ఏదైనా సాధించాలంటే చదువు చాలా అవసరం...! చదువుంటే మనిషికి విలువ కూడా పెరుగుతుంది. విలువ పెరగడం ద్వారా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే విజయసోపానం అవుతుంది. ఎందుకంటే మన అందరికి విజయాలకు తొలిమెట్టు నమ్మకం కాబట్టి!!

ఏ పనైనా చెయ్యగలమనే నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోగలుగుతాము. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం విజేతలు ఎలా కావాలో. ఏం చేస్తే విజయం లభిస్తుందో తెలుస్తుంటుంది. కొన్ని కొన్ని అవకాశాలను మనం వినియోగించుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనం ఓర్పు, మానసిక ధైర్యాన్ని పొందుతాము. విజేత కావాలనుకునే వ్యక్తికి ఓర్పు, మానసిక ధైర్యం చాలా అవసరం. విజయాన్ని సాధించాలి అనే ఆలోచన మనలో వున్నప్పుడు అనుకోకుండా సమయాన్ని సేవ్ చేసుకునే ఒకానొక లక్షణం చేసే  మనలో ఏర్పడుతుంది. సమయాన్ని సేవ్ చేయడం అనేది సాధారణమైన విఆహాయం కాదు. విజయం సాధించాలంటే మొదట సమయం ఎంత విలువైనదో అర్థం కావాలి.  

మనం పట్టుదలతో ఉన్నప్పుడే విజయం మన సొంతమవుతుంది. అలాగే మంచి  వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడతాము. ఇక్కడ మంచి వ్యక్తిత్వం అంటే ఏంటి అని ఆలోచన వస్తే సమాజ ఆమోడయిగ్యమైనది మాత్రమే కాదు నైతిక విలువలు కలిగినదే మంచి వ్యక్తిత్వం. ఇది ఉంటే  నిరాశావాదాన్ని తరిమికొడుతుంది. ఆ  నిరాశావాదం లేకపోతే అపజయం అనే మాట వినబడదు.  

ఆశ అనేది మనుష్యుల్లో నమ్మకాన్ని, బాధ్యతలను పెంచుతుంది. మనం బాధ్యతలను స్వీకరించడం ద్వారా కొంత వరకు కొన్ని కొన్ని విషయాలలో అనుభవాన్ని పొందవచ్చు. ఈ అనుభవం అనేది విజయానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేసే పనిమీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయలేము. పండు కాస్తుంది, లేక పువ్వు పూస్తుంది అన్న నమ్మకం వల్లే మనం మొక్కల్ని నాటుతాము. ఆ నమ్మకమే లేకపోతే మనం మొక్కల్ని కూడా నాటం. మనకు మనం చేసేపని ద్వారా ఫలితం వస్తుంది అన్న భావన వుండడం వల్లనే మనం అన్ని పనులూ చేయగలుగుతున్నాము. ప్రతి మనిషికి లక్ష్యం అనేది వుండాలి. లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా వుంటుంది. అందుకే ప్రతీ మనిషి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న లక్ష్యాన్ని ఏకాగ్రతతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో కొంతమంది స్నేహితులు ఎదురువుతారు. మనం నిజమైన స్నేహితులను ఎన్నుకోవాలి. అదేవిధంగా మనం ఇతరులకు మంచి స్నేహితులుగా నిలిచిపోవాలి. మనం ఏ విషయంలో కూడా మొహమాట పడకూడదు. మొహమాటపడడం వల్ల కొన్ని కొన్నిసార్లు నష్టపోవలని వస్తుంది. 

మన విజయ సాధనలో జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. ప్రతీక్షణం సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడటాన్ని ఇష్టపడాలి, అవిశ్రాంతంగా కృషి చేయాలి. కష్టేఫలి అన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. కష్టంలేకపోతే ఫలితం కూడా లేదు. మనం కష్టపడినప్పుడు ఫలితం లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం ఏర్పరచుకున్న మంచి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అందులో మనం మంచినే గ్రహించడానికి ప్రయత్నించాలి. మంచి వల్ల మనలో పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి.

ఏ పనినైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇష్టంతో చేస్తే కష్టాన్ని మర్చిపోవచ్చు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయం అనేది మనల్ని వెనుకడుగు వేసేలాగా దోహదపడుతుంది. జీవితం అంటేనే సుఖదు:ఖాలమయం. రెండూ అనుభవించినప్పుడే జీవితం యొక్క విలువ మనకు అర్ధమవుతుంది. ఈ సుఖ దుఃఖాలను అనుభవించే సమయంలో మనకు అహంకారం అనేది పెరిగిపోతుంది. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. అందుకే వినయవిధేయతలే విజయాన్ని నిర్దేశిస్తాయంటారు పెద్దలు. కాబట్టి నమ్మకం నుండి వినయంగా నడుచుకోవడం వైపు యువత ప్రయాణం సాగాలి.

                                                        ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.