కేతిరెడ్డికి ప్రజానిరసన సెగ!

Publish Date:May 13, 2024

Advertisement

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి జనం తిరుగుబాటు సెగ గట్టిగా తగిలింది. అధికారం ఉందికదా అని ఈ ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయనను భయంతో భరించిన జనం ఇప్పుడు ఎన్నికల వేళ గట్టిగా బుద్ధి చెప్పారు.

ఓ పొలింగ్ బూత్ వద్దకు వచ్చి ప్రజలను బెదరించి ఓటు వేయించుకోవాలని చూసిన ఆయనకు జనం తిరగబడి నిలదీశారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

తాడిపత్రి ఎమ్మెల్యే తనకు ఓటు వేయకపోతే నరికేస్తానంటూ చేసిన హెచ్చరికకు జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహంతో జనం ఆయనపై తిరగబడ్డారు. జనాగ్రహాన్ని ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన కేతిరెడ్డి అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. 

By
en-us Political News

  
డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు జగన్ హయాంలో ఆడింది ఆటగా, పాడింది పాటగా హవా నడిపించారు. వీళ్ళు ప్రస్తుతం లీవ్ లేదా రిలీవ్ అనే పదాలను జపం చేస్తున్నారు.
తాడేపల్లిలో ప్రస్తుతం వున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసేశారు.
చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఊహించని విధంగా కంగన చెంపను ఛెళ్ళుమనిపించారు.
పవన్ కళ్యాణ్ తన తల్లిని ప్రేమగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత నేరుగా అన్నయ్య చిరంజీవి దగ్గరకి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు.
ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో, వైసీపీలో వున్న రౌడీలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రకరకాల అరాచకాలు చేసి, టీడీపీ కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేసిన వీళ్ళంతా ఇప్పుడు అమాయకపు ముఖాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోదామా అని ఎదురుచూస్తున్నారు.
బొత్స సత్యానారాయణ ఓపెన్ అయిపోయారు. పోలింగ్ తరువాత కూడా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బొత్స సత్యానారాయణ ఫలితాలు వెలువడిన అనంతరం ఓ రోజు మౌనంగా ఉన్నారు.
కొంతమంది మహిళా రైతులు ఈరోజు జగన్ తాడేపల్లి నివాసం గేటు దగ్గరకి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డిని సత్కరించడానికి శాలువా, అరటిపళ్ళు, మామిడిపళ్ళు, బొకేలు, స్వీట్లు తీసుకుని మరీ వెళ్ళారు. వాళ్ళని జగన్ ఇంట్లోకి అనుమతించకుండా గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్లో టిడిపి, జనసేన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నారు. జనసేన అయితే పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్ల మెంట్ స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు చేజిక్కుంచుకుంది. బిజెపి మాత్రం పోటీ చేసిన నాలుగు స్థానాలు కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐదేళ్ళుగా అధికారం చెలాయించిన చాలామంది పెద్దపెద్ద పోస్టుల్లో వున్న అధికారులకు గత రెండు రోజుల నుంచి కొత్త వ్యాధి వస్తోంది. ఆ వ్యాధి పేరు ‘మాయరోగం’.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఘనతను ప్రపంచం మొత్తం గుర్తించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాంకేతికతను సుపరిపాలనకు ఉపయోగించుకోవడం ఎలాగో ప్రపంచానికి ఆచరించి చూపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబును నియమించనున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో.. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో సలహాదారులగా ఓ వెలుగు వెలిగిన వందల మంది రాజీనామాల బాట పట్టారు.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే. గత రెండు సార్లుగా తిరుగులేని మెజారిటీ సాధించిన బీజేపీ స్పీడ్ కు ఈ సారి ఓటర్లు స్పీడ్ బ్రేక్ వేశారు. ప్రభుత్వం కొనసాగించాలంటే మిత్రపక్షాల మద్దుతు తప్పని సరి పరిస్థితి కల్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.