Publish Date:Jun 18, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల విషయంలో తెలుగుదేశం నుంచి మద్దతు లభించకపోవడంతో.. కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ పై అటాక్ చేయడానికి విజయవాడలో సంచలనం సృష్టిస్తోన్న రౌడీ షీటర్ గడే సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకుని నాని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, డిమాండ్ లు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ప్రకాశం జిల్లా నుంచి గడే సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని , అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్ చేశారనీ, మృతదేహాన్ని సైతం పోలీసులు మాయం చేశారనే ఆరోపణలపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేవలం బాధ్యులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును బదిలీ చేయడం లేదా వీఆర్కు పంపడం అనేది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని విమర్శించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. గత నెల 9వ తేదీ నుంచి దాదాపు 35 రోజులకు పైగా సాయికృష్ణను పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఈ సుదీర్ఘ అక్రమ కస్టడీ వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబం లబోదిబోమంటోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కస్టడీ మరణం వార్తలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే జూన్ 29వ తేదీ లోగా బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. కేశినేని నాని, నేరస్థుడిని శిక్షించే అధికారం కేవలం కోర్టులకే ఉందని, పోలీస్ స్టేషన్లు శిక్షలు ఖరారు చేయలేవంటూ విమర్శలు గుప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేయాలని కేశినేని డిమాండ్ చేశారు. తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న అంతర్గత పోరులో సీఎం చంద్రబాబు మద్దతు లభించకపోవడంతో.. నాని ఇలా రూటు మార్చి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kesineni-nanicriticism-against-government-25-223469.html
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.