Publish Date:Jun 18, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల విషయంలో తెలుగుదేశం నుంచి మద్దతు లభించకపోవడంతో.. కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ పై అటాక్ చేయడానికి విజయవాడలో సంచలనం సృష్టిస్తోన్న రౌడీ షీటర్ గడే సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకుని నాని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, డిమాండ్ లు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ప్రకాశం జిల్లా నుంచి గడే సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని , అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్ చేశారనీ, మృతదేహాన్ని సైతం పోలీసులు మాయం చేశారనే ఆరోపణలపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేవలం బాధ్యులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును బదిలీ చేయడం లేదా వీఆర్కు పంపడం అనేది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని విమర్శించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. గత నెల 9వ తేదీ నుంచి దాదాపు 35 రోజులకు పైగా సాయికృష్ణను పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఈ సుదీర్ఘ అక్రమ కస్టడీ వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబం లబోదిబోమంటోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కస్టడీ మరణం వార్తలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే జూన్ 29వ తేదీ లోగా బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. కేశినేని నాని, నేరస్థుడిని శిక్షించే అధికారం కేవలం కోర్టులకే ఉందని, పోలీస్ స్టేషన్లు శిక్షలు ఖరారు చేయలేవంటూ విమర్శలు గుప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేయాలని కేశినేని డిమాండ్ చేశారు. తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న అంతర్గత పోరులో సీఎం చంద్రబాబు మద్దతు లభించకపోవడంతో.. నాని ఇలా రూటు మార్చి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kesineni-nanicriticism-against-government-25-223469.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.