ఇ-నామ్ ప్లాట్ఫామ్ వినియోగం పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని చిన్ని
Publish Date:Jul 30, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) ప్లాట్ ఫామ్ లో నమోదైన ప్రతి మండీలో ఎంత పంట అమ్ముడుపోయింది? ఎంత వ్యాపారం జరిగిందనే అంశంపై విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ ను ప్రశ్నించారు. ఎంపి కేశినేని శివనాథ్ ఈ ప్రశ్నను కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు తో కలిసి అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) కింద నమోదైన లబ్ధిదారులు, మండీలు, వివరాలు జిల్లాల వారీగా ఇవ్వాలని కోరారు... అలాగే ఎపిలో ఇ-నామ్ ప్లాట్ఫాం ద్వారా జిల్లాల వారిగా ఏ ఏడాది ఎంత మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించారో ఆ సంఖ్య తెలియజేయాలని అడిగారు. అదే విధంగా ఎపిలో రైతులు ఇ-నామ్ ప్లాట్ఫామ్ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటల వివరాలు జిల్లాల వారీగా తెలియజేయాల కోరారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం మేరకు ఆంధ్రప్రదేశ్లో జిల్లా వారీగా రైతులు ఇ-నామ్ ప్లాట్ఫామ్ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటలు జిల్లాల వారీగా చూస్తే కర్నూలు ఎక్కువగా ఉపయోగించింది. కర్నూలు-పత్తి, పల్లీలు, ఆముదం గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మిరప, వాము, ఉల్లిపాయ, టమోటా, మొక్కజొన్న పంటలు వేయటం జరిగింది. అనకాపల్లి- బెల్లం, అనంతపురము-బత్తాయి, తరబూజ, చింతపండు, గుంటూరు-పసుపు, మిరప, పత్తి, నిమ్మకాయ, ఎన్.టి.ఆర్-మిరప పంటల కోసం ఇ-నామ్ ప్లాట్ఫామ్ కోసం ఉపయోగించినట్లు తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాలు కూడా ఉపయోగించినట్లు వివరించారు. అలాగే గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఇ-నామ్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రతి మండీలో విక్రయించిన పంటల వివరాలు, జరిగిన వ్యాపారం విలువ జిల్లాల వారీగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5,76,70,992.46 క్వింటాళ్ల అమ్మకం జరగ్గా 41,70,825.01 లక్షల రుపాయలు వ్యాపారం జరిగిందని వివరించారు.
http://www.teluguone.com/news/content/kesineni-nani-question-on-enam-platfom-39-181814.html





