కేశినేని నానికి కమలం కండువా అంత వీజీ కాదు!

Publish Date:Feb 17, 2025

Advertisement

కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయవాడ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.  తెలుగుదేశంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కూడా లభించింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడారనడం కంటే తెలుగుదేశం పార్టీయే ఆయనను వద్దనుకుందని అనడం కరెక్ట్. కేశినేని నాని వ్యవహార శైలి, వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం ద్వారా తన ఉద్దేశాలను చాటిన నానిని ఇక పార్టీకి నీ సేవలు చాలు అని చంద్రబాబు మర్యాదగా చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా నానియే అప్పట్లో చెప్పారు కూడా. సరే ఏది ఏమైతేనేం.. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నానికి ఆయన సొంత సోదరుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఘోర పరాభవం ఎదురైంది.  

ఆ పరాజయ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రాజకీయాలకు దూరంగా ఇంత కాలం ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చూపు మళ్లీ రాజకీయాల వైపు మళ్లంది. ఎంపీగా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఇప్పుడు ఆయన కమలం పార్టీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తరచూ బీజేపీ నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తాజాగా ఇటీవల కేశినేని నాని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయినట్లు వెల్లడి కావడంతో ఆయన కమలం గూటికి చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కేశినేని నాని వాటిని ఖండించారు. అయితే తన వర్గీయులతో నిర్వహించిన భేటీలో తాను రాజకీయాలకు మాత్రమే దూరం అయ్యాననీ, ప్రజాసేవకు కాదని చెప్పడం ద్వారా.. తన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదని సంకేతాలు ఇచ్చారు. 

అయితే ఆయన బీజేపీ గూటికి చేరడానికి చేస్తున్న ప్రయత్నాలే  ఆయన అడుగులు ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి. తెలుగుదేశంతో రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. అటు కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ మనుగడ దాదాపుగా తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేశినేని నానికి తలుపులు తెరుస్తుందా? తెరిచినా ఆయనకు సముచిత స్థానం ఇవ్వగలుగుతుందా? అన్నిటికీ మించి తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఉండగా, విజయవాడ నియోజకవర్గంలో కేశినేని నాని రాజకీయాలు చేయడానికి అనుమతిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసినట్లే.. ఆయన ఎంత గట్టిగా తట్టినా ఆ పార్టీ తలుపులు తెరుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో కమలం ఆయనకు కండువా కప్పి అక్కున చేర్చుకునే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.