కేశినేని అన్నదమ్ముల సవాల్

Publish Date:Jun 6, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరం అనేక కీలకమైన రాజకీయ మలుపులకు కేంద్ర మయింది. ఆంధ్రుల సాస్కృతిక కేంద్రంగా కూడా గణతికెక్కిన బెజబాడ గ్రూపు తగాదాలకూ కేంద్ర బిందువు. తాజాగా రచ్చకెక్కిన కేశినేని బ్రదర్స్ వ్యవహారంతో  ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. కేశినేని బ్రదర్స్ అనగా కేశినేని శ్రినివాస్ అలియాస్ నాని, కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనే ఇద్దరు అన్నదమ్ముల కథ విజయవాడ వీధుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. 

మొదట్లో రామలక్ష్మణుల్లా మెలిగిన వీరిద్దరూ వాలి సుగ్రీవులుగా మారడానికి కారణాలు తెలియాలంటే ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రాంత ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి.  దీంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. సరిగ్గా  ఆ సమయంలోనే యువకులైన మన రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.  దక్షిణ భారత దేశంలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు మూలమైన బెజవాడ నుండి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో ప్రారంభమైన వ్యాపారం మూడు బస్సులు, ఆరు ట్రిప్పులతో అభివృద్ధి చెందింది. పెద్ద వాడైన నానితో పొసగలేక తమ్ముడు చిన్ని వ్యాపారం నుండి వైదొలిగాడు. తన వాటాగా ఒ కోటి రూపాలయు తీసుకుని మోడల్ ట్రావెల్స్  అనే మరో కొత్త అనే మరో కొత్త సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్ తో పాటు ముంబై, చెన్నై వంటి నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాడు.  ఆ రోజుల్లో ముంబై నుంచి కార్గొను హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖ వంటి నగరాలకు చేర్చే వ్యాపారం జోరుగా సాగింది.

దీంతో అనతి కాలంలోనే చిన్ని నానిని మించిన వాడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి.  దీంతో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీసు వ్యూహాలకు నాని పదును పెట్టాడని బెజవాడలో చెప్పుకుంటారు. అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగితో ఉన్న స్నేహంతో శివసేన నేతలతో కలిసి ముంబైలో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీశాడని నానిపై ఆరోపణలు ఉన్నాయి. బాలయోగితో నాని సంబంధాలపై బెజవాడలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.  ముంబాయిలో దెబ్బ తిన్న చిన్ని తన ఫోకస్ ను హైదరాబాద్ పై పెట్టాడు. రియల్ రంగంతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో కూడా నిలదొక్కుకుని నాని తలెత్తి కూడా చూడలేని స్థాయికి ఎదిగాడు. దీంతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు నాని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. విజయవాడ లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. వాలి సుగ్రీవులుగా మారిన నాని, చిన్నిలు పాత కక్షలను మరచిపోలేదు.  ఇప్పటికీ కత్తులు నూరుకుంటున్న కేశినేని బ్రదర్స్ కు ప్రస్తుత రాజకీయాలు కలసి వచ్చాయి. 2024లో విజయవాడ బరిలో నిలబడేందుకు ఇద్దరూ వ్యూహాలు పన్నుతున్నారు.

కేశినేని నాని తెలుగుదేశం పార్టీతో కొంత దూరాన్ని పాటిస్తుండగా, వైసీపీ పరిస్థితులను అంచనా వేసే పనిలో పడింది. ఆర్థిక వనరులకు లోటు లేని చిన్ని ఈ సారి అన్నపై పై చేయి సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలలో ఒక కొత్త అంకానికి తెరలేస్తుంది. కనక దుర్గమ్మ సాక్షిగా, కృష్ణా తీరంలో జకగనున్న కేశినేని అన్నదమ్ముల సవాల్ బవిష్యత్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషించనుందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. 

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.