అవినీతిని అంతం చేస్తానంటూ.. అవినీతి ఆరోపణలతోనే పనతం.. కేజ్రీవాల్ ప్రస్థానం

Publish Date:Feb 9, 2025

Advertisement

ఢిల్లీలో ఊపిరి పోసుకున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)   జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్ లో అధికారం కైవసం చేసుకుని 12ఏళ్లు ఢిల్లీని పరిపాలించి అవమానకర పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, బీజేపీ లను వ్యతిరేకించిన పార్టీగా, అవినీతిని దనుమాడుతామంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆప్  ఆ తరువాత రాజకీయ పరమపద సోపానపటంలో అవినీతి అనే పెద్ద పాము చేతిని చిక్కి పతనమైంది. అవినీతిపై పోరాటం అన్న నినాదాన్ని పక్కన పెట్టి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అలాగే రాజకీయ చదరంగం కూడా ఆడి ఆ ఆటలో బీజేపీ ఎత్తులకు చిత్తైపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో భాగస్వామి అయి కూడా తాజా ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. చేజేతులా ఇండియా కూటమి ఓట్లు చీలి తన ఓటమికి కారణమయ్యేలా చేసుకుంది.  

దశాబ్దానికి పైగా ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా   కనీసం సౌకర్యాల కల్పనలో విఫలమైంది. ఉచితాలనే నమ్ముకుని బొక్కబోర్లా పడింది.  ఆప్  2012లో పుట్టి,2013 ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు కైవసం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తరువాత  .2020 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా  కూడా62 స్థానాలు సాధించి సత్తా చాటుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే మళ్లీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలైంది. 26 ఏళ్లుగా బీజేపీకి అందని ద్రాక్షలా నిలిచిన హస్తిన పీఠాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఆ పార్టీకి  ఈ సారి బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు అందుకుంది. 

 ఈ పరాజయానికి ఆప్ స్వయంకృతాపరాథమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరాజయంతో ఆప్ తాను స్వయంగా ఓడిపోవడమే కాకుండా.. ఇండియా కూటమి ఐక్యతను కూడా ప్రశ్నార్దకం చేసింది.
మిత్రధర్నాన్ని పాటించడానికి అహంకారంతో అంగీకరించకపోవడం కారణంగా, అంటే కాంగ్రెస్ తో పొత్తుకు నిరాకరించడం కారణంగా ఆప్ కనీసం 14 స్థానాలలో స్వల్న తేడాతో ఓడిపోయింది. ఆప్ పార్టీకి పోలైన ఓట్ల శాతం చూస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. కాంగ్రెస్ కు పోలైన 7 శాతం ఓట్లు ఆప్ ఓటమిని లిఖించాయి.  అన్నిటికీ మించి.ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్,ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు.  ఢిల్లీలో దెబ్బతిన్న రహదారులు,  ప్లై ఒవర్లపై గుంతలు,  తాగునీటి సమస్య .యమున జలాలను శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించడం, ఎన్నికలకు ముందు ఆ యమునా జలాలను కలుషితం చేస్తున్నది హర్యానాలోని బీజేపీ సర్కార్ అంటూ ఆరోపణలు చేసి అభాసుపాలు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త కూడా ఆప్ ను ప్రజలు ఊడ్చేయడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పటి వరకూ ఆప్ తన పరాజయాన్ని తానే ఎలా శాశించుకుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి   పకడ్బందీ వ్యూహాలతో, ప్రణాళికా బద్ధంగా  బీజేపీ ఎలా చెక్ పెట్టిందో చెప్పుకుందాం. అవినీతిపై అలుపెరుగని పోరాటం అంటూ మొదలైన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా గత పదేళ్లుగా అడుగులు వేశారు. పంజాబ్ లో అధికార పగ్గాలు ఆప్ చేతికి దక్కాయి. కానీ బీజేపీ ఆయన ఆశలకు, ఆకాంక్షలకు కళ్లెం వేసింది.  సొంత రాష్ట్రంలోనే ఆప్ ను ఓడించింది. ఇందు కోసం ఆప్ లో చీలిక తీసుకువచ్చింది. పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరించిన కేజ్రీవాల్ పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు కేజ్రీవాల్ పార్టీలో కీలకంగా ఉన్న స్వాతి మలివాల్..ఆయనకు బద్ధ వ్యతిరేకిగా మారారు.  ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు తనపై దాడికి పాల్పడినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవడమే స్వాతి మలివాల్  పార్టీలో రెబల్ గా మారడానికి కారణం.  మౌలికసదుపాయాలు కల్పించడంలో విఫలమైన క్రేజీ వాల్ అనే నినాదాన్ని హైలైట్ చేసారు. క్రేజీవాల్ ఓటమిని సోషల్ మీడియాలో మహాభారతం లో "ద్రౌపతి వస్త్రాపహరణం"పోస్టర్ పెట్టి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారంటే పార్టీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు కేజ్రీవాల్ అహంకారాన్ని రావణాసురుడి గర్వంతో పోల్చారు. 
అధికార,ధన దాహం, అవినీతి ఆప్ నైజం అంటూ బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. కేజ్రీవాల్ గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథ, సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే కూడా ఆప్ పరాజయాన్ని స్వాగతించారు. ఇలా అన్ని వర్గాలలోనూ ఆప్ ప్రతిష్ట మసకబారింది. అందుకే మూడు సార్లు ముఖ్యమంత్రిగా  పని చేసిన క్రేజీవాల్  ప్రస్థానం ఒక సామాన్యుడు పర్వేజ్ శర్మ చేతిలో 1844 ఓట్ల తేడాతో ఒటమిపాలయ్యారు.   సొంత నియోజకవర్గంలో ఓటమితో ఆయన ఇక రాజకీయంగా పుంజుకోవడం కష్ట సాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏదిఏమైనా అవినీతి నిర్మూలన నినాదంతో వెలుగులోకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించి,ఆ అవినీతీ లోనే  క్రేజీవాల్,ఆయన ప్రభుత్వం కొట్టుకుపోవడం రాజకీయ నాయకులకు,పార్టీలకు ఒక గుణపాఠంగా మిగులుతుందన్నడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.