Publish Date:Jan 28, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చావో రేవోగా తీసుకున్న భీజేపీ, ఆప్ ల మధ్య ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాటల యుద్ధం మంటలు రేపుతోంది. బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై హర్యానా బీజేపీ నేతల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేజ్రీవాల్ హర్యానాలోని తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
హర్యానా నుంచి పరిశ్రమల వ్యర్థాలను యమునానదిలోకి వదులుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ ఆరోపణలు వాస్తవ మేనంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మంగళవారం (జనవరి 28) మరో బాంబు పేల్చారు. అమోనియా శాతం అధికంగా ఉన్న యమునా నది నీటిని శుద్ధి చేయడం కష్టమని, ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆమె అన్నారు. ఢిల్లీ జల్ బోర్డు అమోనియా స్థాయిని 1 పిపిఎమ్ వరకు శుద్ధి చేయగలదని, అయితే హర్యానా నుంచి యమునా నది నీటిలో అమోనియా స్థాయి 700 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఇక కేజ్రీవాల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హర్యానాలో బీజేపీ నాయకులు కావాలని నీటిలో విషం కలుపుతున్నారు. ఈ నీరు త్రాగితే ఢిల్లీలో చాలా మంది చనిపోతారు. నీటిని శుద్ధి చేయడం కష్టమయ్యే స్థాయిలో యుమునను విషపూరితం చేశారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో హర్యానా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించారు. తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పరిశ్రమల వ్యర్థాలను యమునలోకి వదులుతోందన్న ఆప్ ప్రచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు. అసత్య ఆరోపణలు కేజ్రీవాల్ నైజమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ హర్యానా ప్రజలకు, ఢిల్లీ ప్రజలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-alleges-haryana-bjp-government-poisioned-yamuna-river-25-192002.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.