మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికార ఆప్ ఓటమి మూటగట్టుకుంది. మొత్తం మీద 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసింది. సహజంగానే ఇది బీజేపీ నేతలలో ఉత్సాహాన్ని నింపింది. ఆ పార్టీ నేతలూ, క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల మేరకు బీజేపీ మొత్తం 70 స్థానాలలో 44 స్థానాలలో విజయం సాధించింది. మరో నాలుగు స్థానాలలో పూర్తి ఆధిక్యత కనబరుస్తోంది. ఇక ఆప్ 20 స్ధానాలలో విజయం సాధించింది. మరో రెండింటిలో ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు. ఢిల్లీ ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నాననీ, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాననీ పేర్కొన్నారు. తాను తొలి నుంచీ చెబుతున్నట్లుగా ప్రజల పక్షాన పోరాడేందుకే తాను రాజకీయాలలోకి వచ్చినన్న కేజీవాల్ అధికారాన్ని ఆస్వాదించడానికి కాదన్నారు.
మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అద్భుత విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. వికసిత్ భారత నిర్మాణంలో ఢిల్లీ ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-accepts-defeat-39-192594.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.