కీసర బ్రహ్మోత్సవాల్లో విఐపీ సిఫార్సులు పనిచేయవు : పోలీసులు

Publish Date:Feb 14, 2026

Advertisement

 

కీసరగుట్టలో జరుగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యం, భద్రత దృష్ట్యా పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13, 2026 నుండి 18, 2026 వరకు నిర్వహించబడే ఉత్సవాల కాలంలో ఎలాంటి విఐపీ లేదా ప్రత్యేక పాసులు జారీ చేయబడవని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో కీసరగుట్ట పైకి ఎలాంటి వ్యక్తిగత వాహనాలు అనుమతించ బడవు. ప్రతి భక్తుడు తప్పని సరిగా ఏర్పాటు చేసిన నిర్దేశిత క్యూలైన్ ద్వారానే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. 

వాహనదారులు తమ వాహనాలను కేటా యించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. కీసరగుట్ట కమాన్‌ నుండి అలాగే అన్ని పార్కింగ్ ప్రదేశాల నుండి ఆలయం వరకు ప్రత్యేక ఉచిత షటిల్ బస్ సర్వీ సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ ఉచిత సదుపాయాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశ మున్నందున, శ్రీ రామలింగే శ్వర స్వామి ఆలయంలో దర్శనం సాఫీగా సాగేందుకు అదనపు క్యూలైన్లు, తాగు నీటి సదుపాయం, వైద్య శిబిరాలు మరియు సహా యక సిబ్బందిని ఏర్పాటు చేశారు.పోలీసుల సూచ నలు అతిక్రమించి ఇతర భక్తులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతం గా, విజయవంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించా లని అధికారులు మనవి చేశారు.

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.