పోతిరెడ్డిపాడు పొక్కని పెద్దగజేషిన దొంగ వై.ఎస్

Publish Date:Nov 26, 2012

Advertisement

 

 

నల్గొండజిల్లా సూర్యాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ చంద్రబాబునీ, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డినీ టార్గెట్ చేశారు. ఇద్దరిమీదా తీవ్రస్థాయిలో పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ దుమ్మెత్తిపోశారు. చంద్రన్న రాజ్యంలో రైతుల ఆత్మహత్యలకు అంతే లేకుండా పోయిందంటూ చెలరేగిమాట్లాడుతూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్.

 

వై.ఎస్ బతికున్నన్నాళ్లూ పరోక్షంగాకూడా పదునైన మాటలు మాట్లాడ్డానికి సాహసించని కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఆయన్ని దొంగ అని సంబోధించారు. పోతిరెడ్డిపాడు పొక్కని పెద్దగజేసి తెలంగాణ నీళ్లని దొంగిలించుకుపోయిన గజదొంగ రాజన్న అంటూ వై.ఎస్ పై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

 

పోతిరెడ్డిపాడుకి పెద్ద పొక్కబెట్టి ముందలకేస్తరట, నలభైఏళ్లసంది పండబెట్టిన ఎస్సెల్బీసీ మాత్రం గట్లనే పండ్తదటఅంటూ రెచ్చగొట్టేతీరులో కేసీఆర్ ప్రసంగం సాగింది. వై.ఎస్ సంక్షేమ పథకాల ప్రభావం తెలంగాణపైకూడా విపరీతంగా ఉందని గుర్తించిన టిఆర్ఎస్ నేతలు.. దాన్ని తగ్గించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

 

తాజాగా కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా వై.ఎస్ పై తీవ్రస్థాయిలో పదునైన మాటల్ని ప్రయోగించడం ఇందుకు తార్కాణం. తెలంగాణ ప్రజల పాలిట వై.ఎస్ సైంధవుడు, రాక్షసుడు, యముడిలా ప్రవర్తించారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

By
en-us Political News

  

అక్రమమైనింగ్ వ్యవహారంలో జైలు ఊచలు లెక్కపెడుతున్న గాలి జనార్దన్ రెడ్డి తనకి బెయిల్ సంపాదించుకోవడానికి బంగారాన్ని కరిగించారు. హైదరాబాద్ పాతబస్తీలోని నగల వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్న గాలి అనుచరులు 11 కిలోల బంగారాన్ని అమ్మేశారు.

సోవియట్ యూనియన్ చాలా బలంగా ఉన్న రోజుల్లో అమెరికాకి సోవియట్ కీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయిలో జరిగింది. మేం గొప్పంటూ మేం గొప్పని రెండు దేశాలూ బలప్రదర్శనకి దిగడమే కాక, భారీస్థాయిలో ఆయుధాల్ని, మద్దతుని సమీకరించుకున్నాయ్ కూడా..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నమాటమీద నిలబడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం కుర్చీనుంచి దించకపోతే నెలాఖరుకల్లా రాజీనామా చేస్తానని శపథం చేసిన పెద్దిరెడ్డి మాట నిలబెట్టుకున్నప్పటికీ భారత యుద్ధంలో ధర్మరాజు ఫార్ములాని ప్రయోగించారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపికి గుడ్ బై కొట్టేశారు. తాను పార్టీనుంచి వైదొలగుతున్న విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. బిజెపిలో తనకి నరకం చూపించారంటూ యెడ్డీ కంటతడిపెట్టుకున్నారు.

దుర్వ్యసనాలు, విచ్చలవిడితనం, అప్పులు, బైటపడే మార్గం కనిపించక తిప్పలు.. అడ్డదారిలో డబ్బుసంపాదించేందుకు మార్గం అలోచించాడు. చిన్నారి సాన్వీని కిడ్నాప్ చేస్తే కావాల్సినంత డబ్బు దొరుకుతుందనుకున్నాడు.

హైదరాబాద్ లో పాత బస్తీలో తీవ్రవాదులు పాతుకుపోయారని చాలాకాలంగా వినిపిస్తున్న వదంతులు నిజమేననడానికి ఇప్పుడు తాలిబన్లే ఊతమిచ్చారు. ముంబై మారణకాండకి కారణమైన వాళ్లలో ప్రాణాలతో పట్టుబడ్డ ప్రథాన నిందితుడు కసబ్ ని ఉరితీసినందుకు హైదరాబాద్ ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.

ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లోకి లోతుగా దిగాలనుకుంటున్నాడు. ఆజంగఢ్ లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఆ నియోజకవర్గంలోని 24 గ్రామపంచాతీల సర్పంచ్ ల ఆధ్వర్యంలో రెండొందలమంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు లక్నోకి వచ్చి ములాయం సింగ్ ని కలిసి విషయం ఏకరువు పెట్టారు. 

ప్రథానమంత్రి మన్మోహన్ సింగ్ చివరాఖల్లో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ మన్మోహన్ జీ ఉత్సాహం రెట్టింపవుతోంది. చిన్న చిన్న విషయాలక్కూడా భయపడే ప్రశ్నేలేదన్న సందేశాన్ని మిత్రపక్షాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నవంబర్ 30వ తేదీలోపు ముఖ్యమంత్రి కుర్చీలోంచి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించకపోతే పార్టీకీ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేస్తానని ప్రకటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ఆయన విధించిన డెడ్ లైన్ దగ్గరపడింది. 30వ తేదీకి ఇంక కేవలం రెండు రోజుల గడువుమాత్రమే ఉంది. రాయలసీమలో వాతావరణం వేడెక్కుతోంది.

కేంద్రంలో మంత్రి పదవి దక్కనందుకు అధిష్ఠానం మీద అలిగిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు తన నిరసనని వ్యక్తం చేసేందుకు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఎవరేం చెప్పినా వినకుండా రాజానామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని మంకుపట్టుపట్టుక్కూర్చున్నారు.

పంచ్ డైలాగులతో పవర్ చూపించే దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో ఓ లీడ్ రోల్ పోషించబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఓ కీలకమైన పాత్రని త్రివిక్రమ్ తనే చేయబోతున్నాడు.

ఈ వార్త వినగానే ఢిల్లీ వాసులంతా డీలా పడిపోతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎదురవ్వబోయేది దేశ రాజధానిలోని డీజిల్ కార్ల ఓనర్లకే.. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కాలుష్యాన్ని నివారించడం సాధ్యం కావడంలేదు.

చండీఘడ్ మెడికల్ ఎంట్రన్స్ లో కాపీ కొడుతూ దొరికిపోయిన పిల్లలకు పూర్తిస్థాయిలో గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి తెలుగు సినిమా ప్రొడ్యూసర్. తెరవెనక ఉండి హైటెక్ కాపీయింగ్ ఎపిసోడ్ కి దర్శకత్వం వహించిన నందీశ్వరుడు సినిమా సహనిర్మాత కోటా గంగాధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.