బిజెపిలో నాకు నరకం చూపించారు
Publish Date:Nov 30, 2012
Advertisement
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపికి గుడ్ బై కొట్టేశారు. తాను పార్టీనుంచి వైదొలగుతున్న విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. బిజెపిలో తనకి నరకం చూపించారంటూ యెడ్డీ కంటతడిపెట్టుకున్నారు. పార్టీని విడిచిపెట్టిపోవడం మనసుకు చాలా కష్టంగా అనిపిస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేయాల్సొచ్చిందని చెప్పుకొచ్చారు.
పార్టీకోసం ఎంతగానో శ్రమించిన తనని అధిష్ఠానంలో ఉన్న నేతలు తీవ్రాతి తీవ్రంగా అవమానించారని, తన కష్టాన్ని గుర్తించుకుండా నానా ఇబ్బందులూ పెట్టారనీ యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ లోక్ సభ సీట్లు సంపాదించి పెట్టిన తనని ఇంతగా చులకన చేసి పార్టీనుంచి బైటికెళ్లేలా చేసిన నేతలు త్వరలోనే ఫలితాన్ని అనుభవిస్తారంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. యడ్యూరప్ప రాజీనామా చేయడానికి ముందే ఆయన నియోజకవర్గంలోని నేతలంతా బిజెపికీ గుడ్ బై కొట్టేశారు. తాను ఎవరినీ రాజీనామా చేయమని చెప్పలేదని, వాళ్లంతా తనమీద అభిమానంతో వెంటరావడానికి నిర్ణయించుకున్నారని యడ్యూరప్ప చెప్పారు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు విధానసభలో తన రాజీనామాని సమర్పించాలని యెడ్డీ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన కర్నాటక జనతాపార్టీ పేరుతో యడ్యూరప్ప కొత్త పార్టీని మొదలుపెడుతున్నారు. తొందరపడి బిజెపికి రాజీనామా చేయొద్దని ఆయన తన వర్గం ఎమ్మెల్యేలకు సూచించారు. దాదాపు యాభైమంది ఎమ్మెల్యేలు యడ్యూరప్ప పెట్టబోయే పార్టీలో చేరతారని లెక్కలు మొదలయ్యాయి. సోనియా గాంధీ పుట్టిన రోజునాడే యెడ్డీ కొత్త పార్టీ పెట్టడం మరో విశేషం.
http://www.teluguone.com/news/content/bs-yeddyurappa-resigns-from-bjp-44-19414.html
అక్రమమైనింగ్ వ్యవహారంలో జైలు ఊచలు లెక్కపెడుతున్న గాలి జనార్దన్ రెడ్డి తనకి బెయిల్ సంపాదించుకోవడానికి బంగారాన్ని కరిగించారు. హైదరాబాద్ పాతబస్తీలోని నగల వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్న గాలి అనుచరులు 11 కిలోల బంగారాన్ని అమ్మేశారు.
సోవియట్ యూనియన్ చాలా బలంగా ఉన్న రోజుల్లో అమెరికాకి సోవియట్ కీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయిలో జరిగింది. మేం గొప్పంటూ మేం గొప్పని రెండు దేశాలూ బలప్రదర్శనకి దిగడమే కాక, భారీస్థాయిలో ఆయుధాల్ని, మద్దతుని సమీకరించుకున్నాయ్ కూడా..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నమాటమీద నిలబడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం కుర్చీనుంచి దించకపోతే నెలాఖరుకల్లా రాజీనామా చేస్తానని శపథం చేసిన పెద్దిరెడ్డి మాట నిలబెట్టుకున్నప్పటికీ భారత యుద్ధంలో ధర్మరాజు ఫార్ములాని ప్రయోగించారు.
దుర్వ్యసనాలు, విచ్చలవిడితనం, అప్పులు, బైటపడే మార్గం కనిపించక తిప్పలు.. అడ్డదారిలో డబ్బుసంపాదించేందుకు మార్గం అలోచించాడు. చిన్నారి సాన్వీని కిడ్నాప్ చేస్తే కావాల్సినంత డబ్బు దొరుకుతుందనుకున్నాడు.
హైదరాబాద్ లో పాత బస్తీలో తీవ్రవాదులు పాతుకుపోయారని చాలాకాలంగా వినిపిస్తున్న వదంతులు నిజమేననడానికి ఇప్పుడు తాలిబన్లే ఊతమిచ్చారు. ముంబై మారణకాండకి కారణమైన వాళ్లలో ప్రాణాలతో పట్టుబడ్డ ప్రథాన నిందితుడు కసబ్ ని ఉరితీసినందుకు హైదరాబాద్ ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లోకి లోతుగా దిగాలనుకుంటున్నాడు. ఆజంగఢ్ లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఆ నియోజకవర్గంలోని 24 గ్రామపంచాతీల సర్పంచ్ ల ఆధ్వర్యంలో రెండొందలమంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు లక్నోకి వచ్చి ములాయం సింగ్ ని కలిసి విషయం ఏకరువు పెట్టారు.
ప్రథానమంత్రి మన్మోహన్ సింగ్ చివరాఖల్లో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ మన్మోహన్ జీ ఉత్సాహం రెట్టింపవుతోంది. చిన్న చిన్న విషయాలక్కూడా భయపడే ప్రశ్నేలేదన్న సందేశాన్ని మిత్రపక్షాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నవంబర్ 30వ తేదీలోపు ముఖ్యమంత్రి కుర్చీలోంచి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించకపోతే పార్టీకీ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేస్తానని ప్రకటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ఆయన విధించిన డెడ్ లైన్ దగ్గరపడింది. 30వ తేదీకి ఇంక కేవలం రెండు రోజుల గడువుమాత్రమే ఉంది. రాయలసీమలో వాతావరణం వేడెక్కుతోంది.
కేంద్రంలో మంత్రి పదవి దక్కనందుకు అధిష్ఠానం మీద అలిగిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు తన నిరసనని వ్యక్తం చేసేందుకు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఎవరేం చెప్పినా వినకుండా రాజానామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని మంకుపట్టుపట్టుక్కూర్చున్నారు.
పంచ్ డైలాగులతో పవర్ చూపించే దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో ఓ లీడ్ రోల్ పోషించబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఓ కీలకమైన పాత్రని త్రివిక్రమ్ తనే చేయబోతున్నాడు.
ఈ వార్త వినగానే ఢిల్లీ వాసులంతా డీలా పడిపోతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎదురవ్వబోయేది దేశ రాజధానిలోని డీజిల్ కార్ల ఓనర్లకే.. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కాలుష్యాన్ని నివారించడం సాధ్యం కావడంలేదు.
చండీఘడ్ మెడికల్ ఎంట్రన్స్ లో కాపీ కొడుతూ దొరికిపోయిన పిల్లలకు పూర్తిస్థాయిలో గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి తెలుగు సినిమా ప్రొడ్యూసర్. తెరవెనక ఉండి హైటెక్ కాపీయింగ్ ఎపిసోడ్ కి దర్శకత్వం వహించిన నందీశ్వరుడు సినిమా సహనిర్మాత కోటా గంగాధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో ప్రముఖ శృంగార తారగా ప్రఖ్యాతి గాంచిన భువనేశ్వరి కొత్త లీలలు వెలుగులోకొచ్చాయి. గతంలో వ్యభిచారం దందా చేస్తూ చెన్నై పోలీసుల చేతికి చిక్కిన ఈ శృంగారతార ఇప్పుడు పూటుగా పీకలదాకా మందుకొట్టేసి ఓ సినిమా థియేటర్ ముందు చిందులు తొక్కింది.





