Publish Date:Apr 24, 2024
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) రెండో సారి గెలిచిన తరువాత నుంచే తండ్రీ కొడుకుల మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడమన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్ కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు వీటిలో కారణమేదైతేనేం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కు పట్టాభిషేకం అయితే జరగలేదు.
ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది.
అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు.
అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే... కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-versus-ktr-in-brs-39-174433.html
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే
ఏపీలో ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె.. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవరు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.