రాజకీయ నాయకులలో భాషా సంస్కారం తగ్గిపోతోందన్న విమర్శ ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సభ్య సమాజం ఇసుమంతైనా సహించని పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉపయోగించిన అసభ్య పదజాలం, దూషణలు, అలాగే మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా మరో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగు రమేష్ ఉపయోగించిన భాష ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా సంస్కారం లేకుండా ప్రత్యర్థులపై దూషణల పర్వానికి దిగడం అన్నది ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ రకమై భాష వినియోగానికి శ్రీకారం చుట్టినది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఆరంభించిన ఈ ఆమోదయోగ్యం కాని భాషను ప్రత్యర్థులపై ప్రయోగించే సంస్కృతిని కేసీఆర్ ఆరంబిస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించారని ఆయన పేర్కొన్నారు.
బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని గుర్తుచేశారు. అయితే అప్పట్లో ఉద్యమ వేడి కారణంగా కేసీఆర్ భాషను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. అభ్యంతరం ఉన్నా.. తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉండటంతో.. అడ్డు చెప్పి ఎదుర్కోవడానికి వెనుకాడారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదప్రయోగాలు మాత్రం కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న ఆయన ఈ ధోరణి రాజకీయ నాయకులలో ప్రబలడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
కేసీఆర్ను తమ గురువుగా భావించే జగన్.. ఏపీ రాజకీయాలలోకి కూడా భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడం మొదలెట్టి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన సాగిన ఆ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు సైతం దారుణమైన బూతులతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారన్నారు. దీని వల్ల ఏపీ రాజకీయ సంస్కృతి దారుణంగా దెబ్బతిందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా సమస్యలను చర్చల ద్వారా కాకుండా.. ప్రత్యర్థులను అణచివేస్తూ, తొక్కుకుంటూ ముందుకు సాగాలనే తత్వం వారిద్దరిలోనూ కనిపిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు మాట్లాడటం యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఏబీవీ అభిప్రాపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-started-and-jagan-continue-25-213734.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.