లడ్డూ వివాదం.. కేసీఆర్ మౌనం జగన్ కోసమేనా?

Publish Date:Sep 21, 2024

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు. 

అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సమయం అయినా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూ వాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది. 

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తరువాత కూడా యాజ్ణాలు చేశారు. హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు. అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు.  అయితే నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించడం లేదు. 

లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ అంశంపై స్పందించాయి. కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా స్పందించలేదు.  బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైలా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ల రాజకీయ స్నేహబంధం తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించి జగన్ తన వంతు సాయం చేశారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే సంగతి.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ..కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి. ఇక ఇప్పుడు లడ్డూ వివాదం విషయానికి వస్తే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది. ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.