Publish Date:Apr 18, 2022
ఔనంటే కాదనిలే...కాదంటే ఔననిలే అంటూ అలనాటి మిస్సమ్మ చిత్రంలో ఓ పాట ఉంది. అది కేవలం సినిమా పాటే...కానీ ఆ పాటలోని తొలి పంక్తులు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి అతికినట్లు సరిపోతాయి. ఆయన ఏ విషయం చెప్పినా...ఆచరణలో
అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. దళితులకు మూడెకరాల నుంచి...ఇంటికో ఉద్యోగం, ఉద్యోగ ఖాళీల భర్తి, నిరుద్యోగ భృతి ఇలా ఏ విషయం తీసుకున్నా ఆయన మాటలకూ చేతలకూ పొంతన కనిపించదు. ఇప్పుడు తాజాగా యాద్రాద్రిలో దుకాణాల విషయంలోనూ అదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, అపర తిరుమల రీతిలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కొత్త ఆలయం పూర్తై...భక్తులు ఆలయ సందర్శనకు రావడం ప్రారంభించిన తరువాత ఒక్కటొక్కటిగా జరుగుతున్న పరిణామాలు, కొండపై భక్తులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజాగ్రహం వ్యక్తమౌతున్నది. ముఖ్యంగా ఆలయ
పునర్నిర్మాణ పనుల తనిఖీకి కేసీఆర్ వచ్చిన సమయాలలో కేసీఆర్ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కొండపై వ్యవహారాలు సాగుతున్నాయని స్థానికుల నుంచీ, భక్తుల నుంచీ విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా యాదగిరి గుట్టపై ఒక్క దుకాణం కూడా ఉండదంటూ గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనను విరుద్ధంగా కొండపై దుకాణాలు వెలిశాయి.
వాటి కోసం అధికారులు అధికారికంగా టెండర్లను సైతం ఆహ్వానించారు. దీనిపై నిరుద్యోగుల జేఏసీ ప్రతినిథులు వినూత్నంగా తన నిరసననూ, వ్యతిరేకతనూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం రూపంలో సమర్పించారు. అంతే కాకుండా సర్కార్ మొండి వైఖరికి నిరసనగా ఇదే వినతి పత్రాన్ని దున్నపోతులకు సమర్పించారు. వాగ్దానల విషయంలో కేసీఆర్ కు పెద్దగా పట్టింపు ఉండదన్న నానుడి ఉంది. వాగ్దాన భంగాలపై ప్రజల ఆగ్రహం వ్యక్తమయ్యేలోగా మరో కొత్త వాగ్దానంతో వారి దృష్టి మళ్లించే నైపుణ్యం కేసీఆర్ ప్రత్యేకత అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్య బాణాలు సంధిస్తుంటారు. ఇప్పుడు యాదగిరి గుట్టపై దుకాణాల విషయంలో అది మరో సారి రుజువైంది. గత ఏడాది అక్టోబర్ 19న కేసీఆర్ యాదగిరి గుట్ట సందర్శించిన సందర్భంలో ఆయన కొండపై దుకాణాలు ఉండవని విస్పష్టంగా ప్రకటన చేశారు.
కొండపై దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని, దుకాణాలపైనే ఆధారపడేవారికి టెంపుల్ సిటీలో దుకాణాలు కేటాయిస్తామనీ వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు అధికారులు ఏకంగా బహిరంగ టెండర్లు పిలిచి మరీ దుకాణాలు కేటాయిస్తున్నారు. యాదగిరిగుట్టపైన, కొండ కింద, పుష్కరిణి ప్రాంతంలోదుకాణాలు లేదా వ్యాపార కేంద్రాలను నిర్వహించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లుబహిరంగంగా పిలిచారు. టెండర్ల కోసం పత్రికా ముఖంగా ఆహ్వానం పలికిన దేవస్థానం అధికారులు. టెండర్లు పిలవకముందే యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు తెరిపించేశారు. అంటే గుట్టపై ఒక్కదుకాణం కూడా ఉండదన్న కేసీఆర్ మాటలకు అర్ధం ఇదన్న మాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-says-one-implement-another-25-134541.html
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.