కేసీఆర్‌.. చంద్ర‌బాబును చూసినేర్చుకో!

Publish Date:Jul 29, 2024

Advertisement

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌ వీగితే అధికారం కోల్పోయిన త‌రువాత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌. అన్నీ అనుకూలిస్తే దేశానికి ప్ర‌ధాని కాబోయేది నేనే అంటూ పెద్ద‌ పెద్ద స్టేట్ మెంట్ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చారు. ప‌క్క‌రాష్ట్రాలైన ఏపీ, మ‌హారాష్ట్ర‌లో బీఆర్ఎస్ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చినా.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు నేను పోయేదేంటి అన్న‌ట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇక అసెంబ్లీలో అయితే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ స‌భ్యుల‌ను ఓ ఆటాడుకున్నారు. ఇంత‌లా రెచ్చిపోయిన నేత‌ల‌ను ప్ర‌జ‌లు అస్సలు ఉపేక్షించ‌రు. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అదే ప‌నిచేశారు. ఎన్నిక‌ల స‌మ‌య‌లో కేసీఆర్ కు గ‌ట్టి షాకిచ్చారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్ర‌స్తుతం అసెంబ్లీకి వ‌చ్చేందుకు సైతం కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.  

తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన నాటినుంచి మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. పార్టీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారే త‌ప్ప అధికార పార్టీని నేరుగా ఎదుర్కొనే సాహ‌సం చేయ‌డం లేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న పెద్ద‌గా నోరు మెద‌ప‌డం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతుండ‌టం బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం కేసీఆర్ హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌రు కావాల‌ని ఒత్తిడి చేశారు. అయినా. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రు కాలేదు. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చారు.

భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగాన్నివిని  అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. వేస్ట్ బ‌డ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం రాదు.. వాళ్ల‌కు ఏఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలోకూడా తెలియ‌డం లేదంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆర్నెళ్లు స‌మ‌యం ఇవ్వాల‌ని నేనే అసెంబ్లీకి రాలేదు.. ఇక‌ నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల సంగ‌తి చూస్తా అంటూ కేసీఆర్ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లు చేశారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ ప్ర‌సంగాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేశాయి. సింహం అసెంబ్లీకి వ‌స్తుంది.. కాంగ్రెస్ నేత‌ల‌కు మూడింది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాయి.   కానీ, బ‌డ్జెట్ పై అసెంబ్లీలో జ‌రిగే చ‌ర్చ‌కు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో అసెంబ్లీకి సింహం వ‌స్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద‌ పెద్ద పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి పోకుండా ఇంటివ‌ద్ద‌ ఏం చ‌స్తున్నావ్ కేసీఆర్ అంటూ అదే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక కేసీఆర్ ప‌నైపోయింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖ‌త‌మే అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేదు.. అధికార ప‌క్షం పాల‌నా తీరుపై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది‌. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణుల‌ను కేసీఆర్ ముప్పుతిప్ప‌లు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో ఉండ‌టంతో కేసీఆర్ ప్ర‌తిప‌క్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేసీఆర్ అసెంబ్లీకి వెళితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స‌భ్యులు ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. కౌంట‌ర్ ఇచ్చేందుకు కేసీఆర్ త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కేసీఆర్ ను అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ స‌భ్యులు అవ‌మానిస్తార‌ని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ ముందుగానే ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో సూచ‌న‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో అవ‌మానించారు. అయినా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు చంద్ర‌బాబు అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. త‌న‌కు సాధ్య‌మైనంత స్థాయిలో జ‌గ‌న్, వైసీపీ స‌భ్యుల‌కు అసెంబ్లీలో గ‌ట్టిగా ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. చివ‌రికి త‌న భార్య విష‌యాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన చంద్ర‌బాబు.. సీఎం హోదాలోనే అసెంబ్లీలోనే అడుగు పెడ‌తాన‌ని శ‌పథం చేశాడు. అన్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, చంద్ర‌బాబు త‌ర‌హా రాజ‌కీయాలు కేసీఆర్‌కు అబ్బ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డం కంటే త‌న ప‌రువు మ‌ర్యాద‌లే   ముఖ్య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతున్నది. కేసీఆర్ తీరుపట్ల బీఆర్ఎస్ నేత‌లు,  కార్యకర్తలు సైతం  ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు.  

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.