కేసీఆర్‌.. చంద్ర‌బాబును చూసినేర్చుకో!

Publish Date:Jul 29, 2024

Advertisement

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌ వీగితే అధికారం కోల్పోయిన త‌రువాత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌. అన్నీ అనుకూలిస్తే దేశానికి ప్ర‌ధాని కాబోయేది నేనే అంటూ పెద్ద‌ పెద్ద స్టేట్ మెంట్ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చారు. ప‌క్క‌రాష్ట్రాలైన ఏపీ, మ‌హారాష్ట్ర‌లో బీఆర్ఎస్ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చినా.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు నేను పోయేదేంటి అన్న‌ట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇక అసెంబ్లీలో అయితే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ స‌భ్యుల‌ను ఓ ఆటాడుకున్నారు. ఇంత‌లా రెచ్చిపోయిన నేత‌ల‌ను ప్ర‌జ‌లు అస్సలు ఉపేక్షించ‌రు. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అదే ప‌నిచేశారు. ఎన్నిక‌ల స‌మ‌య‌లో కేసీఆర్ కు గ‌ట్టి షాకిచ్చారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్ర‌స్తుతం అసెంబ్లీకి వ‌చ్చేందుకు సైతం కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.  

తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన నాటినుంచి మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. పార్టీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారే త‌ప్ప అధికార పార్టీని నేరుగా ఎదుర్కొనే సాహ‌సం చేయ‌డం లేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న పెద్ద‌గా నోరు మెద‌ప‌డం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతుండ‌టం బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం కేసీఆర్ హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌రు కావాల‌ని ఒత్తిడి చేశారు. అయినా. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రు కాలేదు. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చారు.

భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగాన్నివిని  అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. వేస్ట్ బ‌డ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం రాదు.. వాళ్ల‌కు ఏఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలోకూడా తెలియ‌డం లేదంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆర్నెళ్లు స‌మ‌యం ఇవ్వాల‌ని నేనే అసెంబ్లీకి రాలేదు.. ఇక‌ నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల సంగ‌తి చూస్తా అంటూ కేసీఆర్ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లు చేశారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ ప్ర‌సంగాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేశాయి. సింహం అసెంబ్లీకి వ‌స్తుంది.. కాంగ్రెస్ నేత‌ల‌కు మూడింది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాయి.   కానీ, బ‌డ్జెట్ పై అసెంబ్లీలో జ‌రిగే చ‌ర్చ‌కు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో అసెంబ్లీకి సింహం వ‌స్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద‌ పెద్ద పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి పోకుండా ఇంటివ‌ద్ద‌ ఏం చ‌స్తున్నావ్ కేసీఆర్ అంటూ అదే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక కేసీఆర్ ప‌నైపోయింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖ‌త‌మే అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేదు.. అధికార ప‌క్షం పాల‌నా తీరుపై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది‌. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణుల‌ను కేసీఆర్ ముప్పుతిప్ప‌లు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో ఉండ‌టంతో కేసీఆర్ ప్ర‌తిప‌క్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేసీఆర్ అసెంబ్లీకి వెళితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స‌భ్యులు ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. కౌంట‌ర్ ఇచ్చేందుకు కేసీఆర్ త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కేసీఆర్ ను అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ స‌భ్యులు అవ‌మానిస్తార‌ని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ ముందుగానే ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో సూచ‌న‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో అవ‌మానించారు. అయినా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు చంద్ర‌బాబు అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. త‌న‌కు సాధ్య‌మైనంత స్థాయిలో జ‌గ‌న్, వైసీపీ స‌భ్యుల‌కు అసెంబ్లీలో గ‌ట్టిగా ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. చివ‌రికి త‌న భార్య విష‌యాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన చంద్ర‌బాబు.. సీఎం హోదాలోనే అసెంబ్లీలోనే అడుగు పెడ‌తాన‌ని శ‌పథం చేశాడు. అన్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, చంద్ర‌బాబు త‌ర‌హా రాజ‌కీయాలు కేసీఆర్‌కు అబ్బ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డం కంటే త‌న ప‌రువు మ‌ర్యాద‌లే   ముఖ్య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతున్నది. కేసీఆర్ తీరుపట్ల బీఆర్ఎస్ నేత‌లు,  కార్యకర్తలు సైతం  ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు.  

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.